Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
- శ్రద్ధా హత్య కేసులో ఆఫ్తాబ్ ఫోరెన్సిక్ పరీక్షలు వెలుగులోకి..
- సైకో, సోషియోపాథిక్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
- నేరంపై పశ్చాత్తాపం కంటే తనను కాపాడుకోవడంపైనే దృష్టి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Walkar case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ కేసును ప్రజలు అంత తేలిగ్గా మరిచిపోలేరు. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న శ్రద్ధాను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలుగా కోసి, ఢిల్లీ శివారు ప్రాంతాల్లో పారేశాడు. అయితే, అతడిని నిర్వహించిన ఫోరెన్సిక్ ఫలితాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2022లో అఫ్తాబ్కు పాలీగ్రాఫ్, వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్షలు నిర్వహించారు. దీంట్లో అఫ్తాబ్లో సైకో (Psychopathic), సోషియోపాథిక్ (Sociopathic) లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
పరీక్షల సమయంలో అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం, భావోద్వేగం లేకపోవడం, ఇతరుల పట్ల సానుభూతి లేకపోవడం, పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే స్వభావం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అఫ్తాప్పై అగ్రెసివ్ టెండెన్సీ స్కేల్, ఐసెంక్ పర్సనాలటీ టెస్ట్, పిక్చర్ ప్రస్ట్రేషన్ టెస్ట్, ఎమోషనల్ మెచ్యురిటీ టెస్ట్ నిర్వహించారు. వీటి ద్వారా ఆగ్రహ స్వభావం, భావోద్వేగ నియంత్రణ, ఒత్తిడిని ఎదుర్కొనే తీరు, వ్యక్తిత్వ లక్షణాలను విశ్లేషించారు. ఈ పరీక్షల్లో అఫ్తాబ్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని, చట్టం నుంచి ఎలా బయటపడాలనేదే అతడి ప్రధాన ఆలోచనగా కనిపించిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే 2022లో సంచలనం సృష్టించిన ఈ కేసులతో విచారణ జాప్యంపై శ్రద్ధావాకర్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె తరుఫు న్యాయవాది సీమా సమృద్ధి కుష్వాహా విచారణ ఆలస్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఉద్దేశపూర్వక ఆలస్యం జరుగుతోందని, త్వరితగతిన విచారణ జరిపించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. విచారణ పూర్తికాకపోవడంతో శ్రద్ధా మృతదేహ అవశేషాలు ఇంకా కేసు ఆధారాలుగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆమెకు పూర్తి స్థాయిలో అంత్యక్రియలు నిర్వహించలేకపోతున్నారని న్యాయవాది తెలిపారు. ఇప్పటికే శ్రద్ధా తల్లి 2020లో మరణించగా, తండ్రి 2025లో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ హత్య కేసు కారణంగా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!