Venu Goapl Reddy
Author- NTV Telugu-
The Sun: సూర్యుడిపై భారీ విస్పోటనం.. 2 లక్షల కిలోమీటర్ల పొడవైన సౌరజ్వాల
A huge explosion on the sun: సూర్యుడిపై ఇటీవల కాలంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా సౌర విస్పోటనాలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ) వెలువడుతున్నాయి. మంగళవారం సూర్యుడిపై భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల సూర్యుడి ఉపరితలం నుంచి 2 లక్షల కిలోమీటర్ మేర సౌరజ్వాల ఎగిసిపడింది. పేలుడు నుంచి వెలువడిని సౌరజ్వాల భూమి వైపుగా రావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. -
kabul Blast: ఆఫ్ఘనిస్తాన్లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు
Bomb blast in Kabul: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాజధాని కాబూల్ లోని ప్రభుత్వ కాంప్లెక్స్ లోని మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. తాలిబాన్ నేతృత్వంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలోని మసీదులో బుధవారం పేలుడు సంభవించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. -
Sonia Gandhi: మైసూరు ఆలయంలో సోనియాగాంధీ ప్రత్యేక పూజలు
Sonia Gandhi Offers Prayers At Mysuru Temple: దసరా సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సోనియాగాంధీ మైసూరు జిల్లా హెచ్ డీ కోట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ ఆలయంలో పూజలు చేశారు. కర్ణాటకలో జరుగుతున్న కాంగ్రెస్ జోడో యాత్రలో గురువారం పాల్గొనబోతున్నారు సోనియాగాంధీ. దీని కోసం ఆమె సోమవారమే కర్ణాటక చేరుకున్నారు. మైసూరులో ఓ ప్రైవేట్ రిసార్టులో ఆమె ఉన్నారు. -
Fake Job Racket: నకిలీ జాబ్స్ మోసం.. మయన్మార్ నుంచి 13మంది ఇండియన్స్ సేఫ్
13 Indians trapped in fake IT job racket rescued from Myanmar: నకిలీ జాబ్ రాకెట్ వలలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రక్షించారు. మయన్మార్ దేశంలో ఐటీ జాబ్స్ కోసమని వెళ్లారు 45 మంది భారతీయులు. అయితే అక్కడి వెళ్లాక కానీ తెలియలేదు తామంతా మోసపోయామని. మయన్మార్ లోని మైవడ్డీ ప్రాంతంలో అంతర్జాతీయ జాబ్ రాకెట్ బారిన పడిన 13 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. వీరంతా బుధవారం తమిళనాడుకు… -
Delhi: ఢిల్లీలో భారీగా బంగారం పట్టివేత
Gold seizure in Delhi: ఢిల్లీలో భారీగా బంగారం పట్టుబడింది. ఈశాన్య ఢిల్లీలో డీఆర్ఐ అధికారులు రూ.33.40 కోట్ల విలువ చేసే 65.46 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఐజ్వాల్ నుంచి ముంబాయి వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లో బంగారాన్ని గుర్తించిన పాట్నా, ఢిల్లీ, ముంబాయి డీఆర్ఐ స్పెషల్ టీములు గుర్తించాయి. గోనే సంచుల్లో బంగారం తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు పక్కా ప్లాన్ తో గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేశారు. -
Mukesh Ambani: ముకేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు.. పేల్చేస్తామని హెచ్చరిక
Death threat to Mukesh Ambani Family: రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ అధినేత, మల్టీ బిలియనీర్ ముకేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు ఆగంతకులు. బుధవారం మధ్యాహ్నం, 12.57 నిమిషాలకు సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ల్యాండ్ లైన్ నెంబర్ కు తెలియన నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆస్పత్రిని పేల్చేస్తామని హెచ్చరించారు. అంబానీ కుటుంబంలోని కొంతమందిని చంపేస్తామని బెదిరించారు. -
Nobel Prize 2022: కెమిస్ట్రీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్.. “క్లిక్ కెమిస్ట్రీ” పరిశోధనలకు ప్రైజ్
Nobel Prize 2022: రసాయన శాస్త్రంలో విశేష కృషికి గానూ.. ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్తోగోనల్ కెమిస్ట్రీ అభివృద్ధికి గానూ కరోలిన్ బెర్టోజీ, మోర్టెన్ మెల్డార్, బారీ షార్ప్లెస్ నోబెల్ బహుమతి అందుకున్నారు. ఇంజనీరింగ్ టూల్స్ ఫర్ మాలుక్యూల్స్ బిల్డింగ్స్ పై వీరంతా పరిశోధనలు చేశారు. బారీ షార్ప్ లెస్, మోర్టెన్ మెల్డల్ క్లిక్ కెమిస్ట్రీ క్రియాత్మక రూపానికి పునాది వేశారు. పరమాణు బిల్డింగ్స్ బ్లాక్స్ పై పరిశోధనలు చేశారు. కరోలిన్ బెర్టోజీ వీటిని జీవులలో ఉపయోగించడం… -
Amit Shah: పాకిస్తాన్తో మాటల్లేవ్.. జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెడతాం..
No talks with Pakistan Says Amit Shah: జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాకిస్తాన్ పై, జమ్మూ కాశ్మీర్లో గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తో ఎలాంటి చర్చలు ఉండవని.. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్లటి.. దేశంలో అత్యంత ప్రశాంత ప్రదేశాంగా మారుస్తుందని నొక్కి చెప్పారు. బారముల్లాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్… -
Earthquake Hits Iran: ఇరాన్లో భారీ భూకంపం.. 500 మందికి గాయాలు
Earthquake Hits Iran: ఇరాన్ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. వాయువ్య ఇరాన్ లోని పశ్చిమ అజార్ బైజార్ ప్రావిన్సులోని భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 528 మంది గాయపడ్డారు. 135 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. భూకంపం ధాటికి 12 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు. -
Mohan Bhagwat: “మత ఆధారిత” జనాభా అసమతుల్యతను విస్మరించొద్దు.
RSS Chief Mohan Bhagwat comments on Religion-Based Population Imbalance: దసరా సందర్భంగా నాగ్ పూర్ లో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యక్రమంలో చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మత ఆధారిత జనాభా అసమతుల్యతను విస్మరించలేమని అన్నారు. జనాభా నియంత్రణ విధానాలకు పిలుపునిచ్చారు మోహన్ భగవత్. జనాభా అసమతుల్యత దేశ విభజనకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. కసావో, దక్షిణ సూడాన్ వంటి దేశాలు జనాభా అసమతుల్యత కారణంగా విడిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
-
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
-
Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
-
Saudi-Houthi: పశ్చిమాసియాలో కొత్త ఘర్షణ.. సౌదీ-హౌతీ మధ్య దాడులు..పాక్ రంగంలోకి దిగుతుందా?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!