Venu Goapl Reddy
Author- NTV Telugu-
Anti-Hijab Protest: ఇరాన్ హిజాబ్ నిరసనల్లో 90 మందికి పైగా మృతి
Anti-Hijab Protest Iran: ఇరాన్ దేశవ్యాప్తంగా హిజాబ్ కు వ్యతిరేకంగా ఉద్ధృతంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించనుందుకు ఇరాన్న మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత.. ఆమె మరణించింది. మహ్సా అమిని మరణం యావత్ ఇరాన్ దేశాన్ని ఓ కుదుపుకుదిపింది. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ మహిళలు నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
Udhampur Blast: అమిత్ షా పర్యటన లక్ష్యంగా ఉదంపూర్ జంట పేలుళ్లు: జమ్మూ కాశ్మీర్ పోలీసులు
Udhampur Blast : సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎనిమిది గంటల వ్యవధిలో జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ లో ఆగి ఉన్న రెండు బస్సుల్లో పేలుళ్లు జరిగాయి. అమిత్ షా పర్యటన నేపథ్యంలోనే ఉగ్రవాదాలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ వెల్లడించారు. పోలీసులు, ఇతర ఏజెన్సీల సహాయంతో వివిధ కోణాల్లో ఉగ్రకోణాన్ని దర్యాప్తు చేశామని.. ఈ ఘటనలో మహ్మద్ అమీన్ భట్ అనే నిందితుడి ప్రమేయం ఉన్నట్లుగా కాశ్మీర్ పోలీసులు తెలిపారు. -
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియాగాంధీ.
Sonia Gandhi To Join Bharat Jodo Yatra On Thursday: కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ఆ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను మొదలుపెట్టారు. తమిళనాడులో ప్రారంభం అయిన ఈ యాత్ర కేరళ మీదుగా ప్రస్తుతం కర్ణాటక చేరుకుంది. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రతో మమేకం అవుతున్నారు. -
Karnataka: దళిత బాలుడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి..
Dalit Boy Tied To Electric Pole, Thrashed For Alleged Theft: దళిత బాలుడిపై కర్కశంగా ప్రవర్తించారు. దొంగతనం ఆరోపణలతో విద్యుత్ స్తంభానికి కట్టేసి చావబాదారు. అడ్డొచ్చిన బాలుడి తల్లిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనల కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. 14 ఏళ్ల బాలుడు చెవిపోగును దొంగిలించడనే ఆరోపణలపై పది మంది వ్యక్తుల బాలుడిని చావబాదారు. సెప్టెంబర్ 29న బెంగళూర్ సమీపంలోని దళిత వర్గానికి చెందిన బాలుడు యశ్వంత్ చెవిపోగును దొంగిలించాడని ఉన్నత వర్గం వారు ఆరోపించారు. -
Pope Francis: ఇంకెంత రక్తపాతం జరగాలి.. దయచేసి పుతిన్, జెలన్ స్కీలు యుద్ధాన్ని ఆపాలి
Pope Francis Comments on Russia-Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాన్ని ముగించాలని..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలకు విజ్ఞప్తి చేశారు. యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. ఇంకెంత రక్తపాతం జరగాలని ప్రశ్నించారు. శాంతి కోసం ఇరుదేశాలు కట్టుబడి ఉండాలని సూచించారు. తన సొంత ప్రజల కోసం, ఈ యుద్ధాన్ని పుతిన్ ఆపాలని కోరారు. ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న బాధను చూసి చింతిస్తున్నాని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి కోసం సిద్ధంగా ఉండాలని ప్రతిపాదించారు. -
Bihar: నితీష్ ప్రభుత్వానికి షాక్.. వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా..
Bihar Agriculture Minister Sudhakar Singh resigns: బీజేపీని కాదని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో కలిసి బీహార్ లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జేడీయూ నుంచి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఆర్జేడీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా మహాగటబంధన్ ప్రభుత్వంలో భాగంగా ఉంది. ఈ మూడు పార్టీలు మంత్రివర్గంలో భాగంగా ఉన్నాయి. -
Mumbai: ముంబై విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, బంగారం పట్టివేత
Heavy drugs and gold seized at Mumbai airport: మాదకద్రవ్యాలు, బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతున్నాయి విమానాశ్రయాలు, పోర్టులు. ఇటీవల కాలం దేశంలో పలు విమానాశ్రయాల్లో అక్రమంగా ఇండియాలోకి తీసుకువస్తున్న డ్రగ్స్ ను పట్టుకుంటున్నారు కస్టమ్స్ అధికారులు. అధికారుల కళ్లుగప్పి నిషేధిత డ్రగ్స్ ను ఆఫ్రికా దేశాలు, ఆగ్నేయాసియా దేశాల నుంచి ఇండియాలోకి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే డ్రగ్స్ తో పాటు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి బంగారాన్ని కూడా అక్రమ మార్గాల ద్వారా మనదేశంలోకి తీసుకువస్తూ పట్టుబడుతున్నారు. -
Mulayam Singh Yadav: ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స
Mulayam Singh Yadav's condition critical: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. ఆదివారం ఆయన్ను గురుగ్రామ్ లోని మెదాంత ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు. 82 ఏళ్ల ములాయం సింగ్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి ఆరోగ్యంపై సమాచారం అందిన వెంటనే ఉత్తర్ ప్రదేశ్ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ హుటాహుటిన లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరారు. -
Myanmar: భూమిపై నుంచి గాల్లోని విమానంపైకి కాల్పులు.. ప్రయాణికుడికి తీవ్రగాయాలు
Bullet pierces through Myanmar plane mid-air in Myanmar:మయన్మార్ దేశంలో ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోంచి దించి అక్కడ సైన్యం అధికారాన్ని చేపట్టింది. ఆంగ్ సాంగ్ సూచీని అరెస్ట్ చేసి జుంటా ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఆ దేశంలో ప్రజాస్వామ్యం కోరుకుంటున్న వారికి, సైన్యానికి మధ్యలో తీవ్ర సంఘర్షణ జరుగుతోంది. పలు రెబెల్ గ్రూపులు, సైన్యానికి వ్యతిరేకంగా పోరు సాగిస్తున్నాయి. దీంతో అక్కడ కాల్పులు నిత్యకృత్యంగా మారాయి. -
Tamil Nadu: తాగుడుకి బానిసై… కన్నకూతురి జీవితం చిదిమేసే యత్నం
Marriage of minor daughter for money in Tamil Nadu: కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే కర్కశంగా మారుతున్నారు. సొంత కూమార్తె అనే ధ్యాస లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. మరికొంత మంది తమ కూతుర్లను డబ్బుల కోసం అమ్ముతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి. తాజాగా తాగుడుకు బానిసైన ఓ తండ్రి తన సొంత కుమార్తె జీవితాన్ని చిదిమేసే ప్రయత్నం చేశాడు. డబ్బుల కోసం మైనర్ బాలికను వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని…
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?