Sharad Pawar: ఇంత జరుగుతుంటే నిద్ర పోతున్నారా.? మహా సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శివసేనతో పాటు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో కాకపుట్టిస్తోంది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే 35 మంది శివసేన ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో అస్సాం రాజధాని గౌహతిలో క్యాంప్ ఏర్పాటు చేయడంతో రాజకీయ సంక్షోభం మొదలైంది. తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు షిండే. శివసేన, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అల్టిమేటం విసురుతున్నారు.
ఇదిలా ఉంటే బుధవారం ఈ రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సమావేశాం అయ్యారు. ఈ సమయంలో హోంమంత్రిపై శరద్ పవార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు రాష్ట్రం వదిలిపెట్టి సూరత్ వెళ్తుంటే హోంశాఖ, పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందని, మీరంతా పడుకున్నారా..? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్దారు. దాదాపుగా రెండు డజన్ల మంది ఎమ్మెల్యేలు ముంబై వదిలి సూరత్ వెళ్తుంటే కనీసం సీఎంఓ దగ్గర సమాచారం లేదా.? అని ప్రశ్నించారు. హోంశాఖ సహాయ మంత్రి శంభు రాజ్ దేశాయ్ కూడా శివసేన రెబల్ ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఉన్నారు. అధికారులతో పాటు మహావికాస్ అఘాదీలో కీలక నేతలపై శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
- CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
తాజాగా ఈ రోజు (గురువారం) ఎన్సీపీతో పాటు కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా సమావేశం అయ్యాయి. జరుగుతున్న పరిణామాలపై ఇరు పార్టీలు వేరువేరుగా చర్చించాయి. శరద్ పవార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇటు కాంగ్రెస్, అటు ఎన్సీపీలు ఇరు పార్టీలు శివసేనలో విభజన రావడానికి, ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి బీజేపీనే కారణం అని నిందిస్తున్నాయి. అయితే మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కొనసాగుతుందని.. ఐదేళ్లు అధికారంలో ఉంటుందని నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
-
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
-
RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్కు పెళ్లి..?
-
Hi: ఆగస్టు 14న కవిన్తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!