Mamata Banerjee: బీజేపీ మనీ, మజిల్, మాఫియా పవర్ ఉపయోగిస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజీకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూలిపోయే స్థితికి చేరుకుంది. మహావికాస్ అఘాడీని లీడ్ చేస్తున్న శివసేన పార్టీలోనే చీలిక వచ్చింది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే దాదాపు 35 మంది పైగా ఎమ్మెల్యేలతో అస్సాం గౌహతిలో క్యాంప్ పెట్టారు. శివసేన తన మూల సిద్ధాంతాలకు వ్యతిరేఖంగా వ్యవహిరిస్తోందని ఆరోపించారు. బీజేపీతో చేతులు కలపాలని ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు.
అయితే మహారాష్ట్రలో ‘మహా’ సంక్షోభానికి బీజేపే కారణం అని ఇటు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు నిందిస్తున్నాయి. అయితే తాజాగా త్రుణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఉద్ధవ్ ఠాక్రేకు న్యాయం జరగాలని కోరారు. బీజేపీ మనీ, మజిల్, మాఫియా పవర్ ను ఉపయోగిస్తోందని విమర్శించారు. ఏదో ఒక రోజు బీజేపీ కూడా అధికారం నుంచి వెళ్తుందని.. మీ పార్టీని కూడా విచ్ఛిన్నం చేయవచ్చని ఆమె హెచ్చరించారు. అయితే ఇటువంటి వాటికి నేను సపోర్ట్ చేయనని అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అస్సాంకు బదులు బెంగాల్ పంపితే మంచి ఆతిథ్యం ఇస్తామని సెటైర్లు వేశారు. మహారాష్ట్ర తరువాత బీజేపీ ఇతర ప్రభుత్వాలను కూడా కూల్చేస్తారని.. ప్రజలకు న్యాయం జరగాలని, రాజ్యాంగాన్ని కోరుకుంటున్నామని మమతా బెనర్జీ అన్నారు.
Also Read
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
- Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
- National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని, అస్థిర పరిచి రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ, కేంద్రం ప్రభుత్వ భావిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఇలా చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ మహావికాస్ అఘాడీని బలపరుస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమికి అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీ కర్నాటక, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇలాగే చేసిందని గుర్తుచేశారు.
తాజావార్తలు
-
TVK: నీట్ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
-
Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
-
Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
-
China Thanks India: చైనా నావికుల ప్రాణాలను కాపాడిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం.. భారత సైన్యానికి చైనా కృతజ్ఞతలు
-
National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!