Mamata Banerjee: బీజేపీ మనీ, మజిల్, మాఫియా పవర్ ఉపయోగిస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజీకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూలిపోయే స్థితికి చేరుకుంది. మహావికాస్ అఘాడీని లీడ్ చేస్తున్న శివసేన పార్టీలోనే చీలిక వచ్చింది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే దాదాపు 35 మంది పైగా ఎమ్మెల్యేలతో అస్సాం గౌహతిలో క్యాంప్ పెట్టారు. శివసేన తన మూల సిద్ధాంతాలకు వ్యతిరేఖంగా వ్యవహిరిస్తోందని ఆరోపించారు. బీజేపీతో చేతులు కలపాలని ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు.
అయితే మహారాష్ట్రలో ‘మహా’ సంక్షోభానికి బీజేపే కారణం అని ఇటు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు నిందిస్తున్నాయి. అయితే తాజాగా త్రుణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఉద్ధవ్ ఠాక్రేకు న్యాయం జరగాలని కోరారు. బీజేపీ మనీ, మజిల్, మాఫియా పవర్ ను ఉపయోగిస్తోందని విమర్శించారు. ఏదో ఒక రోజు బీజేపీ కూడా అధికారం నుంచి వెళ్తుందని.. మీ పార్టీని కూడా విచ్ఛిన్నం చేయవచ్చని ఆమె హెచ్చరించారు. అయితే ఇటువంటి వాటికి నేను సపోర్ట్ చేయనని అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అస్సాంకు బదులు బెంగాల్ పంపితే మంచి ఆతిథ్యం ఇస్తామని సెటైర్లు వేశారు. మహారాష్ట్ర తరువాత బీజేపీ ఇతర ప్రభుత్వాలను కూడా కూల్చేస్తారని.. ప్రజలకు న్యాయం జరగాలని, రాజ్యాంగాన్ని కోరుకుంటున్నామని మమతా బెనర్జీ అన్నారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని, అస్థిర పరిచి రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ, కేంద్రం ప్రభుత్వ భావిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఇలా చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ మహావికాస్ అఘాడీని బలపరుస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమికి అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీ కర్నాటక, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇలాగే చేసిందని గుర్తుచేశారు.
తాజావార్తలు
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!