Venu Goapl Reddy
Author- NTV Telugu-
UK Economic Crisis: ఆర్థిక కష్టాల్లో బ్రిటన్.. 41ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం
UK Inflation Soars, Now Highest In 41 Years: యూకే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పరిస్థితుల్లో కనిపిస్తోంది. బ్రిటన్ వ్యాప్తంగా ప్రజల జీవన వ్యయాలు పెరుగున్నాయి. ఇంధనం, ఆహార సంక్షభం తలెత్తుతోంది. జనాలు ఇంధనం, ఆహారంపై పెడుతున్న ఖర్చు పెరుగుతోంది. ద్రవ్యోల్భణం ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది. 41 ఏళ్ల గరిష్టానికి యూకేలో ద్రవ్యోల్భణం చేరినట్లు బుధవారం కీలక బడ్జెట్ సందర్భంగా వెలువడిన డేటా తెలిపింది. -
Pakistan PM Shehbaz Sharif: పాకిస్తాన్కు ఉగ్రవాదమే ప్రధాన సమస్య
Terrorism Is Pakistan's Foremost Problem: దాయాది దేశం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశంగా ఉంది. ప్రపంచంలోని పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ కేంద్రం. భారతదేశంపై ఎప్పటికప్పుడు సీమాంతర తీవ్రవాదాన్ని ఎగదోస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ఎప్పుడూ కూడా తమదేశం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం లేదని బుకాయిస్తూనే ఉంటుంది. అయితే తమ వరకు వస్తే కానీ నొప్పి తెలియదన్నట్లు.. తాజాగా పాకిస్తాన్ లో లక్కీమార్వాట్ లో పోలీస్ వ్యాన్ పై ఉగ్రదాడి జరిగింది. అయితే దీన్ని ఖండించారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. -
Amazon Layoffs: ఉద్యోగులకు అమెజాన్ షాక్.. 10వేలమందికి ఊస్టింగ్
Amazon Begins Mass Layoffs: టెక్ దిగ్గజాలు వరసగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, నెట్ ఫ్లిక్స్, మెటా వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగింపును ప్రారంభించాయి. తాజాగా అమెజాన్ కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు యూఎస్ మీడియా నివేదికలు బుధవారం వెల్లడించాయి. చాలా సమీక్షల తర్వాత మేము ఇకపై కొందరి అవసరం ఉండదని హార్డ్వేర్ చీఫ్ డేవ్ లింప్ బుధవారం ఉద్యోగులకు ఇచ్చిన మెమోలోమ పేర్కొన్నారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను కోల్పోతామని మాకు తెలుసు కాబట్టి ఈ వార్త తెలపడం బాధగా… -
Iran: ఇరాన్లో కాల్పులు.. ఐదుగురు మృతి.. వరసగా ఉరిశిక్షలు విధింపు
5 Killed, 10 Injured In Shooting At Protesters In Busy Iran Market: హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో అట్టుడుకున్న ఇరాన్ లో కాల్పులు జరిగాయి. ఇరాన్ లోని నైరుతి ఖుజేస్తాన్ ప్రావిన్సులో నిరసనకారులు, భద్రతాబలగాలపైకి ఉగ్రదాడులు జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం ఐదుగురు మరణించినట్లు అక్కడి మీడియా బుధవారం వెల్లడించింది. రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించడంతో పాటు 10 గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఒక మహిళ మరియు… -
Tamil Nadu: మైనర్ బాలికపై లైంగిక దాడి.. మత్తు మందు ఇచ్చి బ్లాక్మెయిల్
Physical assault on minor girl in Tamil nadu: తమిళనాడులో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు ఐదుగురు దుర్మార్గులు. సామూహిక లైంగికదాడికి పాల్పడటంతో పాటు బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికకు నరకం చూపించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చిలో జరిగింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడేలా చేసింది ఆమెకు బంధువే. బంధువుతో పాటు మరో నలుగురు వ్యక్తులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. -
Qualcomm Snapdragon 8 Gen 2 SoC: క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ కొత్త చిప్సెట్ ఆవిష్కరణ.. కొత్త చిప్సెట్తో రాబోతున్న ఫోన్లు ఇవే..
Qualcomm Snapdragon 8 Gen 2 SoC officially unveiled: క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జెనరేషన్ 2 ఎస్ఓసీ చిప్ సెట్ ను అధికారంగా ఆవిష్కరించారు. బుధవారం జరిగిన స్నాప్డ్రాగన్ సమ్మిట్ 2022లో తన కొత్త స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ను ఆవిష్కరించింది. అంతకుముందు ఉన్న Gen 1+ SoC తర్వాత ఈ కొత్త చిప్ సెట్ వస్తోది. ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది Gen 1 చిప్ సెట్ తో పోలిస్తే… -
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం
earthquake Hits Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా దీవుల్లో భారీ భూకంపం వచ్చినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. రిక్టర్ స్కేల్ పై 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇండోనేషియా సుమత్రా ద్వీపానికి నైరుతి దిక్కులో బుధవారం 6 తీవ్రతతో భూకంపం వచ్చిందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం కేంద్రం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. -
Kiran Bedi: తల్లిదండ్రులు తమ కూతుళ్లపై నిఘా ఉంచాలి..
Parents must keep track of their daughters, Kiran Bedi on Shraddha's murder: పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్యపై స్పందించారు. అమ్మాయిలు తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినా సరే.. వారు తమ కూతుళ్లపై నిఘా ఉంచాలని అన్నారు. ఈ కేసులో తల్లిదండ్రులు తమ కూతురు గురించి ఆలస్యంగా ఆరా తీశారని అన్నారు. శ్రద్ధా తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అన్నారు. ఈ ఘటనకు ఇరుగుపొరుగు వారు, ఆమె నివసించి ఫ్లాట్ యజమాని… -
Meta Layoffs: వాట్సాప్ ఇండియా, మెటా ఇండియా కీలక ఉద్యోగులు రాజీనామా..
WhatsApp India Head, Meta India Public Policy Director Quit: ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా భారీగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. మెటాలో పనిచేస్తున్న 13 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో 11,000 ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ద్రవ్యోల్భనం, ఆదాయం తగ్గడం, ఆర్థిక మాంద్యం భయాలతో మెటా భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తోంది. -
G20 Summit: ప్రధాని మోదీకి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సెల్యూట్..
President Biden's 'Salute' To PM Modi At G20: ఇండోనేషియా బాలిలో జీ-20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్, ఇతర అధినేతలు మడ అడవులను సందర్శించి మొక్కలు నాటారు. బాలిలోని తమన్ హుటాన్ రాయ మడ అడవులను దేశాధినేతలు సందర్శించారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!