Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ.. ఎవరికెన్ని పదవులంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర బీజేపీ- శివసేన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వ మంత్రి వర్గ కూర్పు ఖారైంది. ఇరు పక్షాలు చెరో 9 మంత్రి పదవులను పంచుకున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా 18 మందిని మంత్రి పదవులు వరించనున్నాయి. రెండు భాగస్వామ్య పార్టీల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా ఇరు పక్షాలు చెరి సమానంగా మంత్రి పదవులు తీసుకున్నాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ, శివసేన పార్టీ నుంచి 9 మంది చొప్పున ఎమ్మెల్యేలు మంత్రులుగా ఈ రోజు పదవీ స్వీకారం చేయనున్నారు.
శివసేన నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ప్రభుత్వం పడిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఏక్ నాథ్ షిండే సారథ్యంలో బీజేపీ, శివసేన ఏక్ నాథ్ షిండే వర్గంతో ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోయిన 40 రోజుల తర్వాత కేబినెట్ విస్తరణ జరిగింది. ప్రస్తుతం శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్నారు. మెజారిటీ ఎంపీలు కూడా ఏక్ నాథ్ షిండే వెంటే నడుస్తున్నారు.
Also Read
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
Read Also: Black Magic: చనిపోయిన భర్త లేచొస్తాడు.. మంత్రగాడి మాయ
ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిఫ్యూటీ సీఎంగా ఉన్నారు. తాజాగా కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చాలా సార్లు మంతనాలు జరిగాయి. అమిత్ షా, జేపీ నడ్డాలతో షిండే, ఫడ్నవీస్ భేటీ అయ్యారు. తాజాగా మంత్రి వర్గవిస్తరణలో బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్, సురేష్ ఖాడే, రాధా కృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గావిట్,అతుల్ సేవ్ లకు మంత్రి పదవులు లభించాయి. ఇక ఏక్ నాథ్ షిండే శివసేన వర్గం నుంచి దాదా భూసే, సందీపన్ బుమ్రే, ఉదయ్ సమంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్, శంభురాజే దేశాయ్ లకు మంత్రి పదవులు దక్కాయి.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!