Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ.. ఎవరికెన్ని పదవులంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర బీజేపీ- శివసేన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వ మంత్రి వర్గ కూర్పు ఖారైంది. ఇరు పక్షాలు చెరో 9 మంత్రి పదవులను పంచుకున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా 18 మందిని మంత్రి పదవులు వరించనున్నాయి. రెండు భాగస్వామ్య పార్టీల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా ఇరు పక్షాలు చెరి సమానంగా మంత్రి పదవులు తీసుకున్నాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ, శివసేన పార్టీ నుంచి 9 మంది చొప్పున ఎమ్మెల్యేలు మంత్రులుగా ఈ రోజు పదవీ స్వీకారం చేయనున్నారు.
శివసేన నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ప్రభుత్వం పడిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఏక్ నాథ్ షిండే సారథ్యంలో బీజేపీ, శివసేన ఏక్ నాథ్ షిండే వర్గంతో ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోయిన 40 రోజుల తర్వాత కేబినెట్ విస్తరణ జరిగింది. ప్రస్తుతం శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్నారు. మెజారిటీ ఎంపీలు కూడా ఏక్ నాథ్ షిండే వెంటే నడుస్తున్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Black Magic: చనిపోయిన భర్త లేచొస్తాడు.. మంత్రగాడి మాయ
ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిఫ్యూటీ సీఎంగా ఉన్నారు. తాజాగా కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చాలా సార్లు మంతనాలు జరిగాయి. అమిత్ షా, జేపీ నడ్డాలతో షిండే, ఫడ్నవీస్ భేటీ అయ్యారు. తాజాగా మంత్రి వర్గవిస్తరణలో బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్, సురేష్ ఖాడే, రాధా కృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గావిట్,అతుల్ సేవ్ లకు మంత్రి పదవులు లభించాయి. ఇక ఏక్ నాథ్ షిండే శివసేన వర్గం నుంచి దాదా భూసే, సందీపన్ బుమ్రే, ఉదయ్ సమంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్, శంభురాజే దేశాయ్ లకు మంత్రి పదవులు దక్కాయి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!