Bihar: నేడు నితీష్ ప్రమాణ స్వీకారం.. మరోవైపు బీజేపీ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar will take oath as Chief Minister of Bihar today: బీహార్ రాష్ట్రంలో మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న నితీష్ కుమార్ మరోసారి ఆర్జేడీతో జట్టు కట్టబోతున్నారు. బుధవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు 8వసారి నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న గవర్నర్ ను కలిసిన నితీష్ కుమార్.. తనకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ఎమ్మెల్యే మద్దతు ఉందని.. అందుకు సంబంధించిన 164 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ ఫాగు చౌహాన్ కు అందించారు.
Read Also: Attack on Student: నల్గొండలో దారుణం.. యువతిపై ప్రమోన్మాది కత్తితో దాడి
Also Read
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
నిన్న తేజస్వీ యాదవ్ ఇంట్లో ఇఫ్తార్ విందుకు హాజరైన నితీష్.. గతంలో ఆర్జేడీతో బంధాన్ని తెంచుకున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘ క్షమించమని’ కోరినట్లు సమాచారం. జరిగిన పరిణామాలన్నింటికి బీజేపీ, అమిత్ షానే కారణం అని నితీష్ కుమార్ భావిస్తున్నారు. మహారాష్ట్ర తరహాలోనే బీహార్ లో బీజేపీ కుట్ర చేస్తుందని భావించిన నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఇదిలా ఉంటే బీహార్ చర్యలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు రవిశంకర్ ప్రసాద్, సుశీల్ కుమార్ మోదీలు బీహార్ వెళ్లారు. మరోవైపు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రజలు ఇచ్చిన తీర్పుకు నితీష్ ద్రోహం చేశారని.. ఇది ఆయన సహజ లక్షణం అని బీజేపీ విమర్శిస్తోంది. అధికారం కోసం సిద్ధాంతాలు తాకట్టు పెట్టే వ్యక్తి నితీష్ అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది.
మరోవైపు కూటమి పొత్తుపై ఇప్పటికే ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు అవగాహనకు వచ్చాయి. ప్రభతు్వంలో మంత్రి పదవుల గురించి అవగాహన కుదుర్చుకున్నాయి. రాష్ట్రీ జనతా దళ్ ( ఆర్జేడీ)కి 16 మంత్రి పదవులు, జనతా దళ్ యునైటెడ్(జేడీయూ)కు 13 మంత్రి పదవులు, కాంగ్రెస్ పార్టీకి 4, హిందూస్థాని అవామ్ మోర్చాకు ఒక మంత్రి పదవి దక్కనుంది.
తాజావార్తలు
-
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
-
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
-
School Van Hit by Train: ఘోర ప్రమాదం… స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
-
Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
-
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!