Bihar: నేడు నితీష్ ప్రమాణ స్వీకారం.. మరోవైపు బీజేపీ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar will take oath as Chief Minister of Bihar today: బీహార్ రాష్ట్రంలో మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న నితీష్ కుమార్ మరోసారి ఆర్జేడీతో జట్టు కట్టబోతున్నారు. బుధవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు 8వసారి నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న గవర్నర్ ను కలిసిన నితీష్ కుమార్.. తనకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ఎమ్మెల్యే మద్దతు ఉందని.. అందుకు సంబంధించిన 164 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ ఫాగు చౌహాన్ కు అందించారు.
Read Also: Attack on Student: నల్గొండలో దారుణం.. యువతిపై ప్రమోన్మాది కత్తితో దాడి
Also Read
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
నిన్న తేజస్వీ యాదవ్ ఇంట్లో ఇఫ్తార్ విందుకు హాజరైన నితీష్.. గతంలో ఆర్జేడీతో బంధాన్ని తెంచుకున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘ క్షమించమని’ కోరినట్లు సమాచారం. జరిగిన పరిణామాలన్నింటికి బీజేపీ, అమిత్ షానే కారణం అని నితీష్ కుమార్ భావిస్తున్నారు. మహారాష్ట్ర తరహాలోనే బీహార్ లో బీజేపీ కుట్ర చేస్తుందని భావించిన నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఇదిలా ఉంటే బీహార్ చర్యలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు రవిశంకర్ ప్రసాద్, సుశీల్ కుమార్ మోదీలు బీహార్ వెళ్లారు. మరోవైపు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రజలు ఇచ్చిన తీర్పుకు నితీష్ ద్రోహం చేశారని.. ఇది ఆయన సహజ లక్షణం అని బీజేపీ విమర్శిస్తోంది. అధికారం కోసం సిద్ధాంతాలు తాకట్టు పెట్టే వ్యక్తి నితీష్ అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది.
మరోవైపు కూటమి పొత్తుపై ఇప్పటికే ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు అవగాహనకు వచ్చాయి. ప్రభతు్వంలో మంత్రి పదవుల గురించి అవగాహన కుదుర్చుకున్నాయి. రాష్ట్రీ జనతా దళ్ ( ఆర్జేడీ)కి 16 మంత్రి పదవులు, జనతా దళ్ యునైటెడ్(జేడీయూ)కు 13 మంత్రి పదవులు, కాంగ్రెస్ పార్టీకి 4, హిందూస్థాని అవామ్ మోర్చాకు ఒక మంత్రి పదవి దక్కనుంది.
తాజావార్తలు
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..