Uttar Pradesh: స్వాతంత్య్ర దినోత్సవం వేళ విధ్వంసానికి ఐసిస్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISIS Planning Terror Attack On August 15: స్వాతంత్య్ర దినోత్సవం వేళ విధ్వంసానికి పాల్పడాలని ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇండిపెండెంట్ డే వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ కుట్ర చేసింది. అయితే ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీలో సభ్యుడిగా ఉన్న సబావుద్దీన్ అజ్మీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తుండటాన్ని గుర్తించిన యూపీ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ సబావుద్దీన్ అజ్మీని లక్నో హెడ్ క్వార్టర్స్ లో విచారించిన తరువాత అదుపులోకి తీసుకుందని లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. యూపీ ఆజంగఢ్ జిల్లా ఆమీలో ప్రాంతానికి చెందిన సబావుద్దీన్ కు దిలావర్ ఖాన్, బైరామ్ కాన్ అనే పేర్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి ఐఎస్ఐఎస్ రిక్రూటర్లలో నేరుగా పరిచయాలు ఉన్నాయి. దీంతో అతనిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులను పెట్టారు పోలీసులు. నిందితుడు అజ్మీ దగ్గర నుంచి బాంబుల తయారీకి ఉపయోగించే పదార్ధాలు, అక్రమ ఆయుధాలు, కాట్రిడ్జ్ స్వాధీనం చేసుకుంది ఏటీఎస్.
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
Read Also: Bihar: నేడు నితీష్ ప్రమాణ స్వీకారం.. మరోవైపు బీజేపీ ఆందోళన
ఉగ్రవాది సబావుద్దీన్ అజ్మీ ఐసిస్ భావజాలానికి ప్రభావితం అయి.. మరి కొంత మందిని ఐసిస్ లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఫేస్ బుక్ లో బిలాల్ అనే వ్యక్తితో తరుచుగా మాట్లాడుతూ.. కాశ్మీర్ లోని పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిలాల్, పట్టుబడ్డ అజ్మీకి ఐఎస్ఐఎస్ సభ్యుడు మూసా అలియాస్ ఖత్తాబ్ కాశ్మీరిని పరిచయం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడ్డ ఉగ్రవాది మూసాతో పాటు సిరియాలోని అబు బకర్ అల్ షామీతో టచ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విధ్వంసానికి పాల్పడటంతో పాటు ఆర్ఎస్ఎస్ సభ్యులను టార్గెట్ చేసుకుని హతమార్చాలనే కుట్ర పన్నుతున్నాడని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!