Uttar Pradesh: స్వాతంత్య్ర దినోత్సవం వేళ విధ్వంసానికి ఐసిస్ ప్లాన్
ISIS Planning Terror Attack On August 15: స్వాతంత్య్ర దినోత్సవం వేళ విధ్వంసానికి పాల్పడాలని ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇండిపెండెంట్ డే వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ కుట్ర చేసింది. అయితే ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీలో సభ్యుడిగా ఉన్న సబావుద్దీన్ అజ్మీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తుండటాన్ని గుర్తించిన యూపీ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ సబావుద్దీన్ అజ్మీని లక్నో హెడ్ క్వార్టర్స్ లో విచారించిన తరువాత అదుపులోకి తీసుకుందని లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. యూపీ ఆజంగఢ్ జిల్లా ఆమీలో ప్రాంతానికి చెందిన సబావుద్దీన్ కు దిలావర్ ఖాన్, బైరామ్ కాన్ అనే పేర్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి ఐఎస్ఐఎస్ రిక్రూటర్లలో నేరుగా పరిచయాలు ఉన్నాయి. దీంతో అతనిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులను పెట్టారు పోలీసులు. నిందితుడు అజ్మీ దగ్గర నుంచి బాంబుల తయారీకి ఉపయోగించే పదార్ధాలు, అక్రమ ఆయుధాలు, కాట్రిడ్జ్ స్వాధీనం చేసుకుంది ఏటీఎస్.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Bihar: నేడు నితీష్ ప్రమాణ స్వీకారం.. మరోవైపు బీజేపీ ఆందోళన
ఉగ్రవాది సబావుద్దీన్ అజ్మీ ఐసిస్ భావజాలానికి ప్రభావితం అయి.. మరి కొంత మందిని ఐసిస్ లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఫేస్ బుక్ లో బిలాల్ అనే వ్యక్తితో తరుచుగా మాట్లాడుతూ.. కాశ్మీర్ లోని పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిలాల్, పట్టుబడ్డ అజ్మీకి ఐఎస్ఐఎస్ సభ్యుడు మూసా అలియాస్ ఖత్తాబ్ కాశ్మీరిని పరిచయం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడ్డ ఉగ్రవాది మూసాతో పాటు సిరియాలోని అబు బకర్ అల్ షామీతో టచ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విధ్వంసానికి పాల్పడటంతో పాటు ఆర్ఎస్ఎస్ సభ్యులను టార్గెట్ చేసుకుని హతమార్చాలనే కుట్ర పన్నుతున్నాడని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!