Bihar Politics: బీజేపీ మాస్టర్ స్ట్రోక్.. ఒక రోజులోనే కోవిడ్ నుంచి కోలుకున్న స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బీహర్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సీఎం నితీష్ కుమార్ ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. బీజేపీ పార్టీని కాదని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతున్నారు నితీష్ కుమార్. దీంతో బీజేపీ కూడా అతివేగంగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బీహార్ రాజకీయంలో స్పీకర్ కీలకంగా మారాడు. దీంట్లో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆదివారం స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రకటించాడు. అయితే తాజాగా సోమవారం టెస్టుల్లో ఆయనకు కోవిడ్ నెగిటివ్ వచ్చిందంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కేవలం ఒకే రోజులో స్పీకర్ కోవిడ్ నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం బీహార్ లో ఆసక్తి రేపుతోంది.
ఇదిలా ఉంటే ఆర్జేడీతో అధికారం చేపట్టాలని చూస్తున్న నితీష్ కుమార్ కు షాకిచ్చేందుకు సిద్ధం అయింది బీజేపీ. ప్రస్తుతం స్పీకర్ బీజేపీ వ్యక్తే కావడంతో గతంలో అనర్హత ఎదుర్కొంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యేలపై చర్యలకు ఉపక్రమించాడు. సోమవారం బీజేపీ నేత రామ్ నాయాయన్ మండల్ నేతృత్వంలోని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సభ్యులతో స్పీకర్ సమావేశమై నివేదిక సమర్పించారు. మొత్తం 18 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు 2021 మార్చిలో బీహార్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన ‘పోలీస్ బిల్లు’పై జరిగిన చర్చ సమయంలో అసెంబ్లీ విధులకు ఆటంకం కలిగించారు. వీరందరిపై ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
Also Read
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
ఇదిలా ఉంటే మొత్తం 243 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122. అయితే బీజేపీకి జేడీయూకు కలిపి ప్రస్తుతం 127 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రస్తుతం బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధం అయిన జేడీయూ.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో కూటమి ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఒక వేళ స్పీకర్ ఆర్జేడీ 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసినా.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
-
Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!