Bihar Politics: బీజేపీ మాస్టర్ స్ట్రోక్.. ఒక రోజులోనే కోవిడ్ నుంచి కోలుకున్న స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బీహర్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సీఎం నితీష్ కుమార్ ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. బీజేపీ పార్టీని కాదని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతున్నారు నితీష్ కుమార్. దీంతో బీజేపీ కూడా అతివేగంగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బీహార్ రాజకీయంలో స్పీకర్ కీలకంగా మారాడు. దీంట్లో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆదివారం స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రకటించాడు. అయితే తాజాగా సోమవారం టెస్టుల్లో ఆయనకు కోవిడ్ నెగిటివ్ వచ్చిందంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కేవలం ఒకే రోజులో స్పీకర్ కోవిడ్ నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం బీహార్ లో ఆసక్తి రేపుతోంది.
ఇదిలా ఉంటే ఆర్జేడీతో అధికారం చేపట్టాలని చూస్తున్న నితీష్ కుమార్ కు షాకిచ్చేందుకు సిద్ధం అయింది బీజేపీ. ప్రస్తుతం స్పీకర్ బీజేపీ వ్యక్తే కావడంతో గతంలో అనర్హత ఎదుర్కొంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యేలపై చర్యలకు ఉపక్రమించాడు. సోమవారం బీజేపీ నేత రామ్ నాయాయన్ మండల్ నేతృత్వంలోని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సభ్యులతో స్పీకర్ సమావేశమై నివేదిక సమర్పించారు. మొత్తం 18 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు 2021 మార్చిలో బీహార్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన ‘పోలీస్ బిల్లు’పై జరిగిన చర్చ సమయంలో అసెంబ్లీ విధులకు ఆటంకం కలిగించారు. వీరందరిపై ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ఇదిలా ఉంటే మొత్తం 243 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122. అయితే బీజేపీకి జేడీయూకు కలిపి ప్రస్తుతం 127 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రస్తుతం బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధం అయిన జేడీయూ.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో కూటమి ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఒక వేళ స్పీకర్ ఆర్జేడీ 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసినా.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!