Bihar Politics: బీజేపీ మాస్టర్ స్ట్రోక్.. ఒక రోజులోనే కోవిడ్ నుంచి కోలుకున్న స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Politics: బీహర్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సీఎం నితీష్ కుమార్ ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. బీజేపీ పార్టీని కాదని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతున్నారు నితీష్ కుమార్. దీంతో బీజేపీ కూడా అతివేగంగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బీహార్ రాజకీయంలో స్పీకర్ కీలకంగా మారాడు. దీంట్లో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆదివారం స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రకటించాడు. అయితే తాజాగా సోమవారం టెస్టుల్లో ఆయనకు కోవిడ్ నెగిటివ్ వచ్చిందంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కేవలం ఒకే రోజులో స్పీకర్ కోవిడ్ నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం బీహార్ లో ఆసక్తి రేపుతోంది.
ఇదిలా ఉంటే ఆర్జేడీతో అధికారం చేపట్టాలని చూస్తున్న నితీష్ కుమార్ కు షాకిచ్చేందుకు సిద్ధం అయింది బీజేపీ. ప్రస్తుతం స్పీకర్ బీజేపీ వ్యక్తే కావడంతో గతంలో అనర్హత ఎదుర్కొంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యేలపై చర్యలకు ఉపక్రమించాడు. సోమవారం బీజేపీ నేత రామ్ నాయాయన్ మండల్ నేతృత్వంలోని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సభ్యులతో స్పీకర్ సమావేశమై నివేదిక సమర్పించారు. మొత్తం 18 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు 2021 మార్చిలో బీహార్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన ‘పోలీస్ బిల్లు’పై జరిగిన చర్చ సమయంలో అసెంబ్లీ విధులకు ఆటంకం కలిగించారు. వీరందరిపై ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
Also Read
ఇదిలా ఉంటే మొత్తం 243 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122. అయితే బీజేపీకి జేడీయూకు కలిపి ప్రస్తుతం 127 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రస్తుతం బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధం అయిన జేడీయూ.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో కూటమి ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఒక వేళ స్పీకర్ ఆర్జేడీ 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసినా.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
-
Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
-
Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
-
Ben Stokes Returns: ‘క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది’.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
-
Lockup Death: ఏపీలో లాకప్ డెత్లు పరంపర.. రెండు జిల్లాల్లో ప్రకంపనలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!