Bihar Politics: బీజేపీతో జేడీయూ తెగదెంపులు.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం నితీష్ కుమార్
Bihar Politics: బీజేపీతో జేడీయూ దాదాపుగా తెగదెంపులు చేసుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఈరోజు జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అయ్యారు నితీష్ కుమార్. బీజేపీ కూటమితో ప్రభుత్వంలో ఉండటం తన మనుగడకే ముప్పు వాటిల్లుతోందని.. జేడీయూ అభిప్రాయపడుతోంది. దీంతో పాటు ఇటీవల ఆర్సీపీ సింగ్ వ్యవహారం కూడా జేడీయూ పార్టీకి రాజీనామా చేశారు. చేస్తూ.. చేస్తూ..నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే జేడీయూ అదిరిపోయే వార్త చెబుతానంటూ నితీష్ కుమార్ వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు బలం కూర్చేలా నితీష్ కుమార్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. దీంతో బీజేపీ, జేడీయూ బంధం దాదాపుగా తెగిపోయినట్లే అని తెలుస్తోంది. అయితే చివరి ప్రయత్నంగా సీఎం నితీష్ కుమార్ కు కేంద్ర హోమంత్రి అమిత్ షా ఫోన్ చెసినట్లు తెలుస్తోంది. మరోవైపు నితీష్ కుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో టచ్ లో ఉన్నారు.
ఇక రాష్ట్రీయ జనతా దళ్( ఆర్జేడీ), జేడీయూతో జట్టు కట్టేందుకు సముఖంగా ఉంది. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. ఇటు బీజేపీ నేతలు కూడా డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ నివాసంలో భేటీ అయ్యారు. బీహార్ పరిస్థితులను నిషితంగా గమనిస్తున్నారు. మరో వైపు బీజేపీకి చెందిన 16 మంది మంత్రులు రాజీనామా చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నితీష్ సారథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో మహాఘట్ బంధన్ కూటమి ఏర్పాటుపై చర్చ జరుగుతోంది.
Also Read
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
- Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..
- Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
Read Also: Kinjarapu Rammohan Naidu: ఎంపీ మాధవ్ పై చర్య తీసుకోవాల్సిందే!
గత నెల నుంచి బీజేపీపై, ఎన్డీయే కూటమిపై జేడీయూ, ముఖ్యంగా సీఎం నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్సీపీ సింగ్, నితీష్ కుమార్ కు సంబంధం లేకుండా కేంద్ర మంత్రి పదవిని తీసుకోవడం ఈ వివాదానికి మూలం అయింది. ఇటీవల ఆర్సీపీ సింగ్.. జేడీయూకు రాజీనామా చేస్తూ.. నితీష్ ఏడు జన్మలెత్తిన ప్రధాని కాలేడనే వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో బీహార్ లో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్ షా.. 2024లో నితీష్ కుమారే మా సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో జరిగే పరిణామాలు మాత్రం వేరేలా ఉన్నాయని జేడీయూ, సీఎం నితీష్ కుమార్ భావిస్తున్నారు.
ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉంటే బీజేపీకి 77, ఆర్జేడీకి 79, జేడీయూకు 45, కాంగ్రెస్ కు 19, వామపక్షాలకు 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. ఎంఐఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో బీజేపీని కాదన్నా కూడా ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో జేడీయూ మెజారిటీ మార్క్ దాటి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్లోనే అత్యధిక స్కోర్..
-
Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
-
KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
-
LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
-
Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!