Venu Goapl Reddy
Author- NTV Telugu-
Pakistan: బలూచిస్తాన్ లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన ట్రైన్.. 15 మంది..
Bomb attack in Pakistan, Train derailed: పాకిస్తాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఓ వైపు బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’, మరోవైపు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ తాలిబాన్లు ఆ దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్సులో బాంబు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. బాంబు దాడిలో 15 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. -
USA: హిందూ ఆలయంపై దొంగల దాడి.. విలువైన వస్తువుల అపహరణ
Thieves attack Hindu temple in USA: హిందూ ఆలయాలపై విదేశాల్లో దాడులు ఆగడం లేదు. ఇటీవల వారం వ్యవధిలో ఆస్ట్రేలియాలో రెండు దేవాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. అంతకు ముందు బ్రిటన్, కెనడా దేశాల్లో కూడా ఇలాగే హిందూ దేవాలయాలపై దుండగులు దాడులు చేసిన సంఘటనలు చూశాం. తాజాగా అమెరికాలో ఓ హిందూ దేవాలయంపై దొంగలు దాడి చేసి ఆలయంలోని విలువైన వస్తువులను దోపిడి చేశారు. -
Krishna Janmabhoomi Case: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం.. ఈ నెల 25కు విచారణ వాయిదా
Krishna Janmabhoomi Case: ఉత్తర్ ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మొగల్ చక్రవర్తి ఔరంగబేబు ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చి మసీదును నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ వివాదంపై హిందూసేన తరుపున విష్ణుగుప్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మథుర కోర్టు విచారణ జరుపుతోంది. తాజాగా శుక్రవారం ఈ వివాదంపై అడిషనల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ 3 కోర్టు విచారణ జరిపింది. తరుపరి విచారణను జనవరి 25కు వాయిదా వేసింది. -
PM Narendra Modi: మోదీ బంగారు విగ్రహం.. అభిమానం చాటుకున్న వ్యక్తి..
Gujarati fan made a golden statue of Prime Minister Narendra Modi: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించింది బీజేపీ. మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాల్లో విజయం సాధించింది. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఘోరంగా ఓడిపోయాయి. ఇదిలా ఉంటే ఈ విజయాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ అభిమాని ఒకరు ఏకంగా 156 గ్రాముల బంగారంతో మోదీ ప్రతిమను తయారు చేశాడు. -
China: చైనా కుతంత్రం.. ఎల్ఏసీ వెంబడి పోరాట సన్నద్ధతను పరిశీలించిన అధ్యక్షుడు జిన్పింగ్
India - China Border Issue: డ్రాగన్ కంట్రీ ఇండియా సరిహద్దుల్లో కుట్రలు చేయడం మానడం లేదు. ఏదో విధంగా భారత్ ను ఇబ్బంది పెడుతామని చూస్తోంది. గతంలో గాల్వాన్ ప్రాంతంలో ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో చైనా దురాక్రమణను భారత సైన్యం ధీటుగా అడ్డుకుంది. ఇదిలా ఉంటే తాజాగా చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ భారత సరిహద్దులో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పోరాట సన్నద్ధతను పరిశీలించారు. -
Pfizer Vaccine: దుమారం రేపుతోన్న ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్.. కొనుగోలు చేయాలని ప్రధానిపై కాంగ్రెస్ ఒత్తిడి..
Pfizer tried bullying India: అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ భారత్ తో దుమారాన్ని రేపుతోంది. ఫైజర్ వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ట్వీట్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పొలిటికల్ రచ్చకు దారితీసింది. కరోనా మొదటి వేవ్ సమయంలో స్వదేశీ వ్యాక్సిన్లను ఎంచుకోవడం కన్నా, విదేశీ తయారీ వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలని ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఒత్తడి తీసుకువచ్చారని ఆరోపించారు. దీంతో ఫైజర్ కంపెనీ భారత ప్రభుత్వం నుంచి చట్టపరమైన రక్షణను… -
Greater Noida: యువతిపై సామూహిక అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
Greater Noida gang rape incident: దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రతీ రోజూ దేశంలో ఎక్కడోొ ఓ చోట అత్యాచార సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. చాలా కేసుల్లో నమ్మకంగా ఉన్న వారే అమ్మాయిలు, మహిళలు, బాలికల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావీ వరసలు, చిన్నాపెద్దా తేడా లేకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. -
Google Layoff: ఐటీ ఉద్యోగాలు ఊస్ట్.. 12,000 మందిని తొలగించనున్న గూగుల్
Google Layoff: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ కూడా ప్రపంచ వ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ శుక్రవారం ఓ మెమోలో తెలిపారు. మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాతి రోజే గూగుల్ 12,000… -
A story of survival: సముద్రంలో తప్పిపోయి నరకయాతన.. ప్రాణాలు కాపాడిన కెచప్, వెల్లుల్లి పొడి
Man survived on ketchup while lost at sea for 24 days: నిజంగా జీవించాలని రాసిపెట్టి ఉంటే ఎంతటి క్లిష్టపరిస్థితుల్లో అయినా సహాయం లభిస్తుంది. సరిగ్గా ఇలాంటిదే ఈ స్టోరి. సముద్రంలో తప్పిపోయిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఏకంగా 24 రోజుల పాటు సముద్రంలో ఎక్కడ ఉన్నాడో తెలియదు, మాట్లాడేందుకు ఎవరూ లేరు, సహాయం దొరుకుతుందో లేదో అనే పరిస్థితుల నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఎల్విన్ ఫ్రాంకోయిస్(47) అనే వ్యక్తి 24 రోజుల పాటు ఒంటరిగా సముద్రంలో గడిపి, చావు నుంచి… -
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ.. సౌత్ గ్రూప్ పైనే ప్రధాన ఆరోపణలు
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుల బెయిల్ పిటిషన్లపై రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. నిందితులు శరత్ చంద్రారెడ్డితో పాటూ విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్ పల్లి బెయిల్ పిటిషన్లపై సీబీఐ స్పెషల్ కోర్టు విచారించింది. విజయ్ నాయర్, అభిషేక్ బోయిన పల్లిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ కోర్టుకు హాజరు పరిచింది. కోర్టులో శరత్ చంద్రారెడ్డిని హాజరుపరిచింది.
తాజావార్తలు
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
-
England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్…! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!