Srilanka Crisis: శ్రీలంకకు కరెంట్ షాక్.. 264 శాతం పెరిగిన కరెంట్ ఛార్జీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka To Raise Electricity Rates: శ్రీలంక ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇప్పటికే కరెంట్ కోతలతో అల్లాడుతున్న జనానికి మరో షాక్ ఇచ్చింది శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డ్(సీఈబీ). తన నష్టాలను పూడ్చుకునేందుకు ప్రజలపై భారాన్ని మోపింది. ఏకంగా 264 శాతం ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు మరింత భారాన్ని మోయాల్సిన పరస్థితి ఏర్పడింది. 616 మిలియన్ డాలర్ల మేర పేరుకుపోయిన బకాయిల నుంచి బయటపడేందుకు సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తన నష్టాలను అధిగమించాలంటే 800 శాతం మేర ధరలను పెంచాలని ప్రతిపాదిస్తే.. ప్రభుత్వం మాత్రం 264 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది.
శ్రీలంక నిర్ణయం వల్ల 90 కిలోవాట్ల కన్నా తక్కువగా వాడుతున్న 7.8 మిలియన్ కుటుంబాలపై ప్రభావం పడుబోతోంది. ప్రస్తుతం యూనిట్ కు 2.50 రూపాయలు కడుతున్న చిన్న వినియోగదారుడు ఇక మీదట రూ. 8 చెల్లించాల్సి వస్తుంది. ఇక పెద్ద వినియోగదారుడు ఒక్కో యూనిట్ కు రూ.75 రూపాయలు చెల్లించాలి. గతంలో ఇది రూ. 45గా మాత్రమే ఉండేది. శ్రీలంక ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గడిచిన 9 ఏళ్లలో తొలిసారిగా సీఈబీ కరెంట్ ఛార్జీలను పెంచింది.
Also Read
- Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
Read Also: Professor Bikini: బికినీ ధరించింది.. ఉద్యోగం ఊడింది.. ఆపై రూ. 99 కోట్లు..
ఇంధనం, విద్యుత్, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక.. ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు చేసుకునేందుకు కూడా విదేశీ మారక నిల్వలు లేకుండా అల్లాడుతోంది. శ్రీలంక ఎక్కవగా విద్యుత్ వినియోగం కోసం థర్మల్ జనరేటర్లను వాడుతోంది. వీటన్నింటికి చమురు చాలా అవసరం అయితే.. శ్రీలంక మాత్రం తగినంత చమురును దిగుమతి చేసుకునే అవకాశం లేదు. దీంతో శ్రీలంక తీవ్ర కరెంట్ కోతలతో సతమతం అవుతోంది. 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేక బెయిలౌట్ కోసం ఐఎంఎఫ్ తో చర్చలు జరుపుతోంది.
తాజావార్తలు
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!