Srilanka Crisis: శ్రీలంకకు కరెంట్ షాక్.. 264 శాతం పెరిగిన కరెంట్ ఛార్జీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka To Raise Electricity Rates: శ్రీలంక ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇప్పటికే కరెంట్ కోతలతో అల్లాడుతున్న జనానికి మరో షాక్ ఇచ్చింది శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డ్(సీఈబీ). తన నష్టాలను పూడ్చుకునేందుకు ప్రజలపై భారాన్ని మోపింది. ఏకంగా 264 శాతం ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు మరింత భారాన్ని మోయాల్సిన పరస్థితి ఏర్పడింది. 616 మిలియన్ డాలర్ల మేర పేరుకుపోయిన బకాయిల నుంచి బయటపడేందుకు సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తన నష్టాలను అధిగమించాలంటే 800 శాతం మేర ధరలను పెంచాలని ప్రతిపాదిస్తే.. ప్రభుత్వం మాత్రం 264 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది.
శ్రీలంక నిర్ణయం వల్ల 90 కిలోవాట్ల కన్నా తక్కువగా వాడుతున్న 7.8 మిలియన్ కుటుంబాలపై ప్రభావం పడుబోతోంది. ప్రస్తుతం యూనిట్ కు 2.50 రూపాయలు కడుతున్న చిన్న వినియోగదారుడు ఇక మీదట రూ. 8 చెల్లించాల్సి వస్తుంది. ఇక పెద్ద వినియోగదారుడు ఒక్కో యూనిట్ కు రూ.75 రూపాయలు చెల్లించాలి. గతంలో ఇది రూ. 45గా మాత్రమే ఉండేది. శ్రీలంక ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గడిచిన 9 ఏళ్లలో తొలిసారిగా సీఈబీ కరెంట్ ఛార్జీలను పెంచింది.
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
Read Also: Professor Bikini: బికినీ ధరించింది.. ఉద్యోగం ఊడింది.. ఆపై రూ. 99 కోట్లు..
ఇంధనం, విద్యుత్, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక.. ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు చేసుకునేందుకు కూడా విదేశీ మారక నిల్వలు లేకుండా అల్లాడుతోంది. శ్రీలంక ఎక్కవగా విద్యుత్ వినియోగం కోసం థర్మల్ జనరేటర్లను వాడుతోంది. వీటన్నింటికి చమురు చాలా అవసరం అయితే.. శ్రీలంక మాత్రం తగినంత చమురును దిగుమతి చేసుకునే అవకాశం లేదు. దీంతో శ్రీలంక తీవ్ర కరెంట్ కోతలతో సతమతం అవుతోంది. 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేక బెయిలౌట్ కోసం ఐఎంఎఫ్ తో చర్చలు జరుపుతోంది.
తాజావార్తలు
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..