దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టీవీఎస్ ద్విచక్ర వాహనాల్లో TVS జూపిటర్ 110 ఒకటి. విక్రయాల్లో హోండా యాక్టివా తర్వాత రెండో స్థానంలో ఉన్న ఈ స్కూటర్ ధరలను టీవీఎస్ సంస్థ తాజాగా పెంచింది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం కారణంగా ఈ ధరల పెంపు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇంతకుముందు కూడా టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, రేడియన్, ఎన్టార్క్ 125 మోడళ్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు జూపిటర్ 110 వేరియంట్లపై ధరల పెంపు అమల్లోకి […]
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు లక్ష్యంగా పనిచేస్తున్న సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. సచివాలయ ఉద్యోగుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను అమలు చేయనుంది. ఇందులో భాగంగా, ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో […]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ కేసులో ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తు పూర్తయిందని, కోర్టుకు సీబీఐ తరపున న్యాయవాది […]
Penamaluru Gold Scam: కృష్ణా జిల్లా పెనమలూరులో తక్కువ ధరకు బంగారు నాణాలు అంటూ ఆశచూపి 20.25 లక్షలకు టోకరా వేసిన ఘటన జరిగింది. విజయవాడలో బస్సు డ్రైవర్ గా నరసరావుపేటకి చెందిన తిరుపతి రెడ్డి పనిచేసున్నారు. పెనమలూరులో తనకు తెలిసిన వ్యక్తి వద్ద బిల్లులు లేని బంగారు నాణాలు ఉన్నాయని ఇటీవల తిరుపతి రెడ్డికి బంధువు నరసింహ రెడ్డి చెప్పారు. తక్కువ ధరకు బంగారం ఇస్తారన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని పరిచయం చేశాడు బంధువు నరసింహ […]
Govt Pending BSNL Dues: ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కు చెల్లించాల్సిన టెలిఫోన్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. 2025 డిసెంబర్ 31 నాటికి ఒడిశా ప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థలు కలిపి మొత్తం రూ.28.54 కోట్ల టెలిఫోన్ బిల్లులు బీఎస్ఎన్ఎల్కు చెల్లించాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి లేఖ రాసి, పెండింగ్లో ఉన్న […]
Samsung నుంచి రాబోతున్న Galaxy S26 సిరీస్ ఇప్పటికే టెక్ ప్రపంచంలో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, ఈ సిరీస్లో AI ఆధారిత EdgeFusion ఆన్-డివైస్ ఇమేజ్ జనరేటర్ అనే అత్యాధునిక ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం, Samsung Galaxy S26 సిరీస్ను ఫిబ్రవరి నాల్గవ వారంలో ప్రత్యేకంగా నిర్వహించనున్న Galaxy Unpacked ఈవెంట్లో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. అయితే, Galaxy S26, Galaxy […]
Srisailam Temple Ghee Controversy: ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా జరిగిందా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. సాధారణంగా శ్రీశైలం ఆలయానికి గతంలో విజయ డైరీ నుంచి నెయ్యి సరఫరా జరిగేది. అయితే 2022 మే నెల నుంచి అకస్మాత్తుగా విజయ డైరీని పక్కనపెట్టి, రాజేష్ […]
Vijayawada GGH Doctor Death: బెజవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)లో డ్యూటీలో ఉన్న ఓ యువ వైద్యురాలి మృతి కలకలం రేపింది. తెల్లవారుజామున ఆసుపత్రి వార్డులోనే డాక్టర్ దీపిక మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతపురం జిల్లా చెందిన దీపిక, ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్లో మెడిసిన్ విభాగంలో పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) చదువుతోంది. నిత్యం లాగే నిన్న రాత్రి కూడా ఆమె డ్యూటీకి హాజరైందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. […]
నేడు కూటమి నేతల కీలక భేటీ.. ఆంధ్రప్రదేశ్లో తాజా పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాల మధ్య నేడు కూటమి నేతల మధ్య అత్యంత ప్రాధాన్యత గల సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ కలిసి సమావేశం కానున్నారు. ఈ భేటీకి కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక […]
T20 International Records: ప్రపంచ క్రికెట్లో ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అయితే కొన్ని రికార్డులు మాత్రం కాలం ఎంత గడిచినా చెరగవు. అలాంటి అరుదైన, అద్భుతమైన రికార్డు ఒకటి నేపాల్ స్టార్ ఆల్రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ పేరిట ఉంది. ఎన్ని సిక్సర్లు బాదినా, ఎంత గొప్ప బ్యాటర్లు వచ్చినా.. ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పటివరకు ఎవరికీ సాధ్యపడలేదు. టీ20 వరల్డ్ కప్ 2026: నేపాల్పై ప్రపంచ క్రికెట్ దృష్టి ఐసీసీ పురుషుల టీ20 […]