YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసుపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా హత్యకేసు విచారణ..
- జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు..
- ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేం..
- ఇలా అయితే మూడునాలుగేళ్లు పడుతుంది.. ఇది అంతులేకుండా ముందుకు వెళ్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ కేసులో ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తు పూర్తయిందని, కోర్టుకు సీబీఐ తరపున న్యాయవాది వివరించారు. అయితే, ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీబీఐ స్పష్టం చేసింది.
Read Also: Priyanka Chopra : ప్రియాంక కూతురు మాల్తీకి ఏమైంది? ఆ మూడున్నర నెలలు నరకం చూశామన్న నిక్ జోనస్!
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేం. అలా చేస్తే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఇది అంతులేకుండా ముందుకు వెళ్తుంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ తన దర్యాప్తును కొనసాగించవచ్చని, అలాగే ఎవరిని విచారించాలన్న అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తును వేగంగా పూర్తిచేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది.
ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో, సుప్రీంకోర్టు విచారణను కొంతసేపు పాసోవర్ చేసింది. అనంతరం తిరిగి కేసును విచారించింది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రాధాన్యత కలిగిన ఈ కేసుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ముఖ్యంగా, మినీ ట్రయల్కు అవకాశం లేదని, దర్యాప్తు అంతులేని ప్రక్రియగా మారకూడదని చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో తదుపరి న్యాయపరమైన ప్రక్రియకు దిశానిర్దేశం చేయనున్నాయి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!