Srisailam Temple Ghee Controversy: శ్రీశైలానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా..? కొత్త అనుమానాలు
- శ్రీశైలానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా చేశారా అనే అనుమానం..
- 2022 మే నుండి 2023 మార్చి వరకు నెయ్యి సప్లై చేసిన రాజేష్ కార్పొరేషన్ కాంట్రాక్టర్..
- గతంలో శ్రీశైలం ఆలయానికి విజయ డైరీ నుంచి నెయ్యి సరఫరా..
- విజయ డైరీని కాదని రాజేష్ కార్పొరేషన్ నుంచి నెయ్యి సరఫరాతో చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Temple Ghee Controversy: ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా జరిగిందా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. సాధారణంగా శ్రీశైలం ఆలయానికి గతంలో విజయ డైరీ నుంచి నెయ్యి సరఫరా జరిగేది. అయితే 2022 మే నెల నుంచి అకస్మాత్తుగా విజయ డైరీని పక్కనపెట్టి, రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ నుంచి నెయ్యి సరఫరాకు అనుమతి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Read Also: sreeleela : ప్రతి జన్మలోనూ నువ్వే నా అమ్మగా పుట్టాలి.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్!
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
ప్రత్యేకంగా, రాజేష్ కార్పొరేషన్కు సొంత డైరీ లేకపోవడం, ఇతర సంస్థల నుంచి నెయ్యిని కొనుగోలు చేసి ఆలయానికి సరఫరా చేసినట్టు వస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. రాజేష్ కార్పొరేషన్ సంస్థ బోలే బాబా డైరీ నెయ్యినే కొనుగోలు చేసి, అదే నెయ్యిని శ్రీశైలం దేవస్థానానికి సరఫరా చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో, తిరుమల నెయ్యి వివాదంలో బోలే బాబా డైరీ పేరు వినిపించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అధికారుల సమాచారం ప్రకారం, 2022 మే నుంచి 2023 మార్చి వరకు మొత్తం 11 నెలల కాలంలో రాజేష్ కార్పొరేషన్ సంస్థ శ్రీశైలానికి 3,25,064 కిలోల నెయ్యి సరఫరా చేసింది. ఈ పరిమాణం పెద్దదిగా ఉండటంతో, నెయ్యి నాణ్యతపై మరింత లోతైన విచారణ అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, శ్రీశైలం ఆలయంలో కల్తీ నెయ్యి వాడినట్టు ఇప్పటివరకు ఎలాంటి ధ్రువీకరణ లేదని దేవస్థాన అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రయోగశాల పరీక్షల్లో గానీ, అధికారిక విచారణలో గానీ ఇప్పటివరకు నెయ్యి కల్తీకి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించలేదని తెలిపారు. అలాగే, రాజేష్ కార్పొరేషన్ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ఎక్కడా నిర్ధారణ కాలేదని అధికారులు చెబుతున్నారు. విజయ డైరీ లాంటి ప్రభుత్వ అనుబంధ సంస్థను కాదని, సొంత డైరీ లేని రాజేష్ కార్పొరేషన్కు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎలా దక్కిందన్న అంశంపై ఇప్పుడు పలు వర్గాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
-
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
-
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!