Refrigerator Storage Mistakes: చిన్న తప్పు.. పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు!.. నేటి ఆధునిక జీవనశైలిలో ఫ్రిజ్ లేకుండా వంటగది ఊహించలేనిది. ఆహారం చెడిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి, సమయాన్ని ఆదా చేయడానికి ఫ్రిజ్ ఎంతో ఉపయోగపడుతుంది. కానీ, అన్ని ఆహార పదార్థాలూ ఫ్రిజ్కు అనుకూలం కావు అనే విషయాన్ని చాలామంది పట్టించుకోరు. కొన్ని పదార్థాలను ఫ్రిజ్లో ఉంచితే వాటి రుచి, ఆకృతి, పోషక విలువలు తగ్గడమే కాకుండా, కొన్నిసార్లు ఆరోగ్యానికి హానికరం కూడా […]
NDA Meeting: ఆంధ్రప్రదేశ్లో తాజా పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాల మధ్య నేడు కూటమి నేతల మధ్య అత్యంత ప్రాధాన్యత గల సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ కలిసి సమావేశం కానున్నారు. ఈ భేటీకి కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు […]
* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ భేటీ.. ఈ సమావేశానికి కొంతమంది మంత్రులకు కూడా ఆహ్వానం.. ఇవాళ్టి సమావేశం తర్వాత కీలక నిర్ణయాలు ఉండే అవకాశం * నేడు కరీంనగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. చొప్పదండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ముఖ్యమంత్రి.. అనంతరం గుములాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్న రేవంత్ * అమరావతి: […]
NTV Daily Astrology as on 5th February 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
High Court: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. విశాఖపట్నం సమీపంలోని అడవి వరం, ముడసరిలోవ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న అదానీ డేటా సెంటర్కు సంబంధించిన భూ కేటాయింపుల వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లాలో సుమారు 480 ఎకరాల ప్రభుత్వ భూమిని, సుమారు రూ.5,000 కోట్ల విలువైన భూమిని, అదానీ గ్రూప్కు చెందిన రైడ్ […]
Baireddy Rajasekhar Reddy: రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశాలను ప్రజల ముందు బయటపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ వైసీపీ నేతలు గొంతెత్తుతున్నారని, అయితే వాస్తవానికి రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ గణనీయంగా ఏమీ చేయలేదని బైరెడ్డి విమర్శించారు. బడ్జెట్ […]
షియోమీ సబ్-బ్రాండ్ రెడ్మి నుంచి తాజాగా విడుదలైన Redmi Note 15 Pro+ 5G మరియు Redmi Note 15 Pro 5G స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారతదేశంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. జనవరి 29న లాంచ్ అయిన ఈ రెండు ఫోన్లు ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్సైట్, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్తో పాటు ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్లోని రెండు మోడళ్లలోనూ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, పెద్ద AMOLED డిస్ప్లేలు, […]
Mahindra Scorpio Pick-Up: మహీంద్రా & మహీంద్రా మరోసారి అంతర్జాతీయ మార్కెట్లో తన సత్తాను చాటింది. ఇండోనేషియాకు భారీగా 35,000 స్కార్పియో పిక్అప్ లైట్ కమర్షియల్ వెహికల్స్ (LCVs) ఎగుమతి చేయడానికి మహీంద్రా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఇప్పటివరకు మహీంద్రా సాధించిన అతిపెద్ద ఒక్క ఎగుమతి ఆర్డర్ రికార్డు సృష్టించింది. ఈ ఒక్క ఒప్పందం 2025 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా చేసిన మొత్తం ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. గ్రామీణ లాజిస్టిక్స్కు బలం ఈ వాహనాలను […]
Warm Water on Empty Stomach: ఈ మధ్యకాలంలో ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం చాలా మందికి అలవాటుగా మారింది. కాఫీ లేదా టీకి ప్రత్యామ్నాయంగా, ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ చాలామంది దీనిని పాటిస్తున్నారు. అయితే ఇది నిజంగా జీర్ణక్రియకు సహాయపడుతుందా? లేక మరో వెల్నెస్ ట్రెండ్ మాత్రమేనా? అన్న ప్రశ్నకు శాస్త్రీయంగా సమాధానం తెలుసుకుందాం. ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ప్రకారం, సుమారు 500 మిల్లీ లీటర్ల […]
MLC Nagababu Slams YSRCP: వైసీపీపై ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ హిందూ ద్రోహి.. అంటూ సంచలన వీడియో విడుదల చేసిన నాగబాబు, వైసీపీ హయాంలో జరిగిన అంతర్వేది రథం దగ్ధం ఘటన, రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటన, తిరుమల డిక్లరేషన్ అంశాలపై మండిపడ్డారు. వైసీపీ నాయకులకు హిందువులపై కుళ్లు కుతంత్రాలు తప్ప మరొకటి లేదని విమర్శించారు. తాను గర్వంగా సనాతన హిందువునని పేర్కొన్న నాగబాబు.. ఇతర మతాలను కించపరచకుండా ధర్మం కోసం […]