Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Odisha Government Owes Rs 28 54 Crore To Bsnl Centre Writes To Chief Minister

BSNLకి రూ.28.54 కోట్ల బకాయి పడిన రాష్ట్ర సర్కార్.. సీఎంకు కేంద్రం లేఖ..

Published Date :February 5, 2026 , 12:00 pm
By Sudhakar Ravula
BSNLకి రూ.28.54 కోట్ల బకాయి పడిన రాష్ట్ర సర్కార్.. సీఎంకు కేంద్రం లేఖ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Govt Pending BSNL Dues: ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ (BSNL)కు చెల్లించాల్సిన టెలిఫోన్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. 2025 డిసెంబర్ 31 నాటికి ఒడిశా ప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థలు కలిపి మొత్తం రూ.28.54 కోట్ల టెలిఫోన్ బిల్లులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెల్లించాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి లేఖ రాసి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. ఇటీవల నెలల్లో ఇదే అంశంపై ఆయన ఇప్పటికే మూడుసార్లు రిమైండర్ లేఖలు పంపినప్పటికీ, ఇప్పటివరకు పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగలేదని కేంద్రం పేర్కొంది.

ఆ లేఖలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇలా పేర్కొన్నారు.. “దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో టెలికాం సేవలను అందించడంలో BSNL కీలక పాత్ర పోషిస్తోంది. సాయుధ దళాలు, ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు మరియు అనేక సంస్థలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు అత్యంత అవసరం” అని పేర్కొన్నారు. బలమైన నెట్‌వర్క్‌తో BSNL ప్రజలకు విశ్వసనీయ సేవలను అందిస్తోందని, అయితే సంస్థ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం 2019, 2022 మరియు 2023 సంవత్సరాల్లో పునరుద్ధరణ ప్యాకేజీలను ఆమోదించినట్టు తెలిపారు.

Also Read

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్‌కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్‌లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

స్థిరమైన నగదు ప్రవాహం అవసరం
బీఎస్‌ఎన్‌ఎల్ కార్యకలాపాలు నిరవధికంగా కొనసాగాలంటే స్థిరమైన నగదు ప్రవాహం ఎంతో అవసరమని, ముఖ్యంగా టెలికాం మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం బకాయిల సకాలంలో చెల్లింపులు చాలా కీలకమని సింధియా లేఖలో స్పష్టం చేశారు. ఇప్పటికే టెలికమ్యూనికేషన్ కార్యదర్శి కూడా ఈ బకాయిల చెల్లింపుపై ఒడిశా ప్రభుత్వాన్ని అభ్యర్థించారని పేర్కొన్నారు. ప్రజలకు సురక్షితమైన, విశ్వసనీయమైన టెలికాం సేవలు అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమ బిల్లులను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఏ శాఖకు ఎంత బకాయి?
ఒడిశా ప్రభుత్వ విభాగాల్లో సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ వద్ద అత్యధికంగా రూ.8.59 కోట్ల బకాయిలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. దీని తర్వాత న్యాయ శాఖ రూ.4.42 కోట్ల టెలిఫోన్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. రూ.1 కోటి కంటే ఎక్కువ బకాయిలు ఉన్న ఇతర శాఖల్లో.. అంటే.. విద్య శాఖ, ఆర్థిక శాఖ, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు ఉన్నాయి.

కొంత మేర తగ్గిన బకాయిలు
నవంబర్‌లో కేంద్ర మంత్రి సింధియా పంపిన రిమైండర్ లేఖ తర్వాత కొన్ని శాఖలు తమ పెండింగ్ బిల్లులను కొంత మేర చెల్లించినట్టు సమాచారం. ముఖ్యంగా ఆర్థిక శాఖ, సమాచార & ప్రజా సంబంధాల శాఖలు తమ బకాయిల్లో గణనీయమైన భాగాన్ని చెల్లించాయి. అయితే, మొత్తం పెండింగ్ టెలిఫోన్ బకాయిలు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. మే 2025 నాటికి ఒడిశా రాష్ట్రంలో మొత్తం చెల్లించని టెలిఫోన్ బిల్లులు సుమారు రూ.80 కోట్లకు చేరుకున్నాయని పేర్కొంది. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెల్లించాల్సిన అన్ని బకాయిలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా సంబంధిత శాఖలు, సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కోరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BSNL financial stress
  • BSNL pending bills Odisha
  • BSNL revival package
  • Central government letter to Odisha CM
  • Jyotiraditya Scindia letter to Odisha CM

తాజావార్తలు

  • Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?

  • Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

  • Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..

  • Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions