Off The Record: ఓపెన్ విత్ స్పాట్ చంద్రబాబు జీవీకి క్లాస్ పీకుతున్నది వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, సీఎం చంద్రబాబు మధ్య జరిగిన ఈ సంభాషణే ఇప్పుడు పల్నాడు పాలిటిక్స్లోహాట్ టాపిక్ అయింది. ముఖ్యమంత్రి ముందు బీభత్సమైన బిల్డప్ ఇవ్వబోయిన జీవీ…బూమరాంగ్ అయి బొక్కబోర్లా పడ్డట్టు మాట్లాడుకుంటున్నారు. నియోజకవర్గంలో ఉద్యాన పంటల విషయమై గొప్పలు చెప్పబోయిన ప్రభుత్వ చీఫ్విప్కు బ్రేకులేసిన సీఎం… ముందు పనిచేసి చూపించమని అన్నారు. వినుకొండ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా […]
CM Meeting with Ministers After Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు. అజెండా అంశాలు ముగిసిన తర్వాత రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలను ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంటోందని సీఎం స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదని పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇక, అసెంబ్లీ సమావేశాలు […]
Off The Record: మేకా శేషుబాబు….. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తూ వైసీపీ ఆవిర్భావ సమయంలో జగన్ దరి చేరారు. పార్టీ కూడా ఆయన సీనియారిటీని గౌరవించి ఎమ్మెల్సీని చేసింది. అయితే… ఆయన మాత్రం గ్రూపు తగాదాలు, సొంత పెత్తనాలకు ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో…. పాలకొల్లు ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి పక్కన పెట్టేశారని జిల్లా వైసీపీ నాయకులు చెప్పుకుంటారు. 2014 […]
Cricket Match Dispute: ఢిల్లీలో ఆటస్థలం రణరంగంగా మారింది. క్రికెట్ ఆడుతున్న సమయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తిలక్ నగర్ జిల్లాలోని వుడ్ల్యాండ్ పార్క్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరి 23, రాత్రి 7:22 గంటల సమయంలో తిలక్ నగర్లోని వుడ్ల్యాండ్ పార్క్లో కొందరు బాలురు క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో 12 ఏళ్ల బాలుడికి, 15 ఏళ్ల మరో బాలుడికి మధ్య […]
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త శాఖ ఏర్పాటు అయ్యింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇన్నోవేషన్ను జోడిస్తూ కొత్త శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో మొత్తం 55 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. అలాగే సీఆర్డీఏ మరియు ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడులను […]
VK Sasikala New Political Party: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుంది.. కొత్త పార్టీ ప్రకటించారు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ.. రామనాథపురం సభలో కొత్త పార్టీని ప్రకటించారు శశికళ.. త్వరలోనే పార్టీ పేరు ప్రకటిస్తానని వెల్లడించారు శశికళ.. మనం కొత్త రాజకీయ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ పార్టీ పేదలు, అణగారిన వర్గాలు మరియు సామాన్య ప్రజల కోసం పనిచేస్తుంది అని శశికళ పేర్కొన్నారు. పార్టీ ద్రవిడ ఉద్యమాన్ని అనుసరిస్తుందని, […]
Off The Record: ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారంలో ఉన్నామని, బల్దియా పీఠం మాదేనని తొలుత ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్కు ఫైనల్గా నిరాశ తప్పలేదు. సరిపడా మెజార్టీ రాకపోవడం పక్క పార్టీలు లేదా స్వతంత్రుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ బీజేపీ 21 వార్డుల్లో గెలవగా… ఎంపీ,ఎమ్మెల్యే ఓట్లతో కమలం బలం 23కు చేరింది. 26 సీట్లు గెల్చుకున్న పార్టీకే ఛైర్మన్ పీఠం దక్కుతుంది. […]
Anagani Satya Prasad: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనా కాలంలో పేదలందరికీ ఇళ్లు పేరుతో 6 వేల కోట్ల రూపాయాల కుంభకోణాలకు పాల్పడ్డారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ గత ప్రభుత్వం 22 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే అందులో 7 లక్షల మంది కన్వేయన్స్ డీడ్ లు. తీసుకోలేదన్నారు మంత్రి అనగాని… ఇళ్ల పట్టాల కోసం […]
Off The Record : ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక ఎక్కువ టైం తీసుకోకుండా….త్వరగానే కోలుకుంది వైసీపీ. అంత దారుణ పరాభావం తర్వాత రెండు మూడేళ్ళపాటు అసలు రియాక్షనే ఉండబోదని అనుకున్నారు చాలా మంది. కానీ…. పార్టీ అధినాయకత్వం కోలుకోవడంతో పాటు… టాప్ టు బాటమ్ పార్టీని రీ ఛార్జ్ చేసే యాక్టివిటీని కూడా వెంటనే పెంచేసింది. దాంతో…. అన్ని ప్రాంతాల్లో క్యాడర్ యాక్టివ్ అవుతోంది. చాలా మంది నేతలు అప్పుడే 29 ఎన్నికలకు ప్లాట్ ఫామ్ సిద్ధం […]
Andhra Pradesh Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 56 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెట్టుబడులు, పర్యాటకం, ఇంధన ప్రాజెక్టులు, ఉన్నత విద్య, పరిశ్రమలు వంటి అనేక రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో రూ. 2,387 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ పరిశ్రమకు […]