PAN Card Mandatory: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థిరాస్తి కొనుగోలు మరియు అమ్మకాలకు పాన్ కార్డు తప్పనిసరి చేసింది. ఇండో-నేపాల్ సరిహద్దు జిల్లాల్లో విదేశీ నిధులు, బినామీ ఆస్తుల లావాదేవీలను అరికట్టడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.. అంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆస్తిని కొనుగోలు లేదా విక్రయించేటప్పుడు కోనుగోలుదారులు మరియు విక్రేతలు ఇద్దరూ పాన్ కార్డును అందించాలి. ఆన్లైన్ రిజిస్ట్రీ వ్యవస్థలో కూడా మార్పులు చేసి, పాన్ కార్డు సమాచారాన్ని ఇవ్వకపోతే లావాదేవీ పూర్తి కాకుండా నిలిచిపోనున్నాయి.. […]
Speaker Ayyanna Patrudu: స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.. సభలో ప్రతికూల చర్చలు జరగకుండా, రోడ్లపై మాత్రమే మాట్లాడడం సహజమేనా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం, ప్రజల పక్షాన చర్చించాలనుకుంటే సభకు రండి. మీరు లేవనెత్తే ప్రతీ అంశానికి మంత్రులు ద్వారా సమాధానం ఇవ్వడం నా బాధ్యత అని స్పష్టం చేశారు.. రోడ్లపై చేసే ఈ గుద్దుటల సంస్కృతి ఏమిటో అర్థం కావడం లేదు? అని ఆవేదన వ్యక్తం చేశారు స్పీకర్.. Read Also: […]
NIA Chargesheet: 2025లో ఆంధ్రప్రదేశ్లో తన నివాసం నుండి పేలుడు పదార్థాల స్వాధీనం కేసులో ఒక కీలక నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు షేక్ అమనుల్లా అలియాస్ అబూబకర్ సిద్దిఖీపై విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో యుఎ(పి) చట్టం, బీఎన్ఎస్, పేలుడు పదార్థాల చట్టం 1908 మరియు ఆయుధాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపబడ్డాయి. 1999లో తమిళనాడులో మరో క్రిమినల్ కేసులో […]
Jogi Ramesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది.. ఆయనపై నమోదు చేసిన కేసుల్లో ఎలాంటి కఠిన చర్యలు.. ఏవీ తీసుకోవద్దని ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీసులతో పాటు తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.. ఇక, జోగి రమేష్ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.. మరోవైపు.. విచారణ సందర్భంగా జోగి రమేష్ చేసిన […]
YS Jagan: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి.. దాడి జరిగిన ఆ ఇంటిని పరిశీలించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆ కుటుంబాన్ని పరామర్శించారు.. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?.. తగలబెడతారా..? అంటూ ఫైర్ అయ్యారు.. జోగి రమేష్ ఇల్లు మొత్తం చిన్నాభిన్నం అయ్యింది.. పక్కనే ఉన్న కరెంట్ […]
మాజీ సీఎం వైఎస్ జగన్ జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కళ్లు మూసుకుంటే రెండేళ్లు గడిచాయి, మరో మూడేళ్లు కూడా ఇలానే కళ్లను మూసుకుంటే.. వచ్చేది మన ప్రభుత్వమే.. జగన్ 2.0లో అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు.. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిన తీవ్రంగా ఖండించిన ఆయన.. జోగి రమేష్ ఇల్లు మొత్తం చిన్నాభిన్నం అయ్యింది. స్థానిక పోలీసులు, టీడీపీ నేతలు కలిసి […]
AP Crime: ఓ మైనర్తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని మరిచిపోయింది.. కుటుంబ పెద్దను.. అడ్డుగా ఉన్న అత్తను వేసేయాలని ప్లాన్ చేసింది.. దానికి అనుగుణంగా.. తన మైనర్ ప్రియుడిని రెచ్చగొట్టింది.. చిత్తూరులో సంచలనంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గిరింపేట ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల వివాహిత.. 17 ఏళ్ల మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.. ఈ ఘటన సంచలనంగా మారింది.. […]
Pawan Kalyan: తెలంగాణలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయ్యింది.. ఎల్లుండి నల్గొండలో బీజేపీ తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని ముందే ప్రకటించింది తెలంగాణ బీజేపీ.. అయితే, తాజాగా పవన్ పర్యటన రద్దు అయినట్టు వెల్లడించింది.. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. వ్యక్తిగత కారణాలతో పవన్ పర్యటన రద్దయ్యిందని ప్రకటించింది బీజేపీ.. Read Also: AP High Court: ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యపై హైకోర్టు […]
AP High Court: శ్రీవాణి ఇంజనీరింగ్ కాలేజీలో 2021లో అనుమానాస్పదంగా మృతి చెందిన మువ్వల గణేష్ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో పూర్తి విచారణ జరగలేదని హైకోర్టు తీవ్రంగా అభిప్రాయపడింది. హైకోర్టు అభిప్రాయం ప్రకారం, పోలీసులు కొన్ని వ్యక్తులను రక్షించడానికి మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథలు తయారు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారని హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు సీబీఐ ద్వారా కేసు విచారణ జరపించి, రాష్ట్ర […]
Deputy CM Pawan Kalyan: ప్రతి భక్తుడికి ధార్మిక బాధ్యత ఉండాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దేవుడిపై భయం, ధర్మంపై గౌరవం ఉన్న సాధారణ హిందూ మనస్తత్వంలోని నిద్రావస్థ నుంచి, సౌకర్య భావన నుంచి మనం బయటకు రావాలి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ, ఎవరు మన హిందూ దేవుళ్లను అవమానించినా, మన ధర్మాన్ని ఎగతాళి చేసినా, మనం లోపలే బాధపడి, కర్మకు వదిలేసి, ముందుకు వెళ్లిపోతున్నాం అన్నారు. […]