Andhra Pradesh: గుడ్న్యూస్ చెప్పిన సర్కార్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు లక్ష్యంగా పనిచేస్తున్న సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. సచివాలయ ఉద్యోగుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను అమలు చేయనుంది. ఇందులో భాగంగా, ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్ మార్గం కల్పించేందుకు మూడంచెల వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది.
Read Also: Nagavamsi : ధురంధర్ 2 కు పోటీగా వస్తున్న నాగవంశీ.. ఆ సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు
Also Read
ఈ మూడంచెల విధానంతో ఉద్యోగులకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించనున్నారు.. బాధ్యతల విభజన, పనితీరు ఆధారంగా అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. దీని వల్ల ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, ప్రజలకు అందే సేవల నాణ్యత మరింత మెరుగుపడనుంది. ఇక, ఉద్యోగుల క్రమబద్ధీకరణలో భాగంగా, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన ఉద్యోగులతో భర్తీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇది ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే కాకుండా, ప్రభుత్వ శాఖల్లో మానవ వనరుల లోటును కూడా తగ్గించనుంది. అయితే, ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయం ఉత్సాహాన్నిచ్చే పరిణామంగా మారింది. అయితే, ఈ ప్రమోషన్లు, క్రమబద్ధీకరణకు సంబంధించిన వివరమైన మార్గదర్శకాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అర్హతలు, సీనియారిటీ, సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!