-
Sri Lanka Crisis: శ్రీలంకలోని తమిళులకు స్టాలిన్ సర్కార్ భారీ సాయం
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు నరకం చూస్తున్నారు.. కొనే పరిస్థితి లేదు.. అమ్మడానికి కూడా ఏమీ లేదు అనే తరహాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. ఇప్పటికే శ్రీలంకకు భారత్ భారీ సాయం చేయగా.. ఇప్పుడు.. శ్రీలంకలోని తమిళులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తరపున కోటి రూపాయలు విరాళంగా ఇవ్వనున్నారు.. ప్రభుత్వం తరపున మొదటి విడతగా 40 వేల టన్నుల బియ్యం, 500 టన్నుల మిల్క్ పౌడర్, […] -
Marriage: 15 ఏళ్లుగా సహజీవనం.. ఒకేసారి ముగ్గురు మహిళలతో పెళ్లి..
ఓ వ్యక్తి 15 ఏళ్లుగా ముగ్గురు మహిళలతో సహజీవనం సాగిస్తున్నాడు.. వారికి ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు.. ఆయన వయస్సు 42 ఏళ్లు.. ఇప్పుడు ఒకేసారి ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో గిరిజన ఆచారాల ప్రకారం 42 ఏళ్ల వ్యక్తి మౌర్య.. సహజీవనం చేసిన ముగ్గురు మహిళలను ఒకేసారి వివాహం చేసుకున్నాడు.. ముగ్గురు మహిళలతో అతనికి ఉన్న ఆరుగురు పిల్లలు కూడా వివాహ ఆచారాలలో పాల్గొన్నారు. […] -
KA Paul: మళ్లీ సిరిసిల్ల వస్తున్నా… దమ్ముంటే ఆపండి..!
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పర్యటనను సోమవారం రోజు అడ్డుకున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.. రాజన్న సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన ఆయనను జిల్లా సరిహద్దులో అడ్డుకున్నారు.. అంతేకాదు, ఓ టీఆర్ఎస్ కార్యకర్త పాల్పై చేయి చేసుకోవడం హాట్ టాపిక్గా మారిపోయింది.. అయితే, తాను మళ్లీ సిరిసిల్ల వస్తున్నా.. దమ్ముంటే ఆపండి అంటూ సవాల్ విసిరారు కేఏ పాల్.. నాపై దాడి చేసిన అనిల్తో నాది తెలంగాణ కాదని చెప్పిస్తున్నారు.. బాబు అనిల్ మత్తు తగ్గిన తరువాత ఇది […] -
Jagga Reddy: కేసీఆర్ను కలుస్తా.. రాహుల్ గాంధీ టూర్కి అనుమతి కోరతా..!
తెలంగాణలో త్వరలోనే పర్యటించనున్నారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ.. ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా.. రెండో రోజు ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, పోలీసుల నుండి కానీ, యూనివర్సిటీ వీసీ నుంచి గానీ ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. అనుమతిపై తుది నిర్ణయం వీసీదేనని హైకోర్టు కూడా స్పష్టం చేసింది.. అయితే, రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ టూర్ కోసం సీఎం కేసీఆర్ను కలుస్తానని.. దాని కోసం అపాయింట్మెంట్ […] -
KA Paul: నిన్నే పీకేతో మాట్లాడా.. కేసీఆర్కు వచ్చేవి 28 సీట్లే..!
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. నిన్న తనపై దాడి జరిగిన తర్వాత ఆగ్రహంతో ఊగిపోతున్న ఆయన.. ఇవాళ మీడియా సమావేశం పెట్టి టీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై ధ్వజమెత్తారు.. కేసీఆర్, కేటీఆర్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టు చేస్తున్నారని.. నిన్న సిరిసిల్ల ఎస్పీతో కేటీఆర్ మాట్లాడిన తర్వాత నాపై దాడి జరిగిందని ఆరోపించారు. ముందు 15 – 20 మంది పోలీసులు వచ్చి […] -
MMTS: గుడ్న్యూస్.. టికెట్ ధరలు తగ్గించిన ఎంఎంటీఎస్..
హైదరాబాదీలకు గుడ్న్యూస్ చెప్పింది ఎంఎంటీఎస్.. పెట్రో ధరల పెంపుతూ వరుసగా రవాణా చార్జీలు పెరుగుతుండగా… ఎంఎంటీఎస్ మాత్రం టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ జర్నీ టిక్కెట్ ధరలు తగ్గిపోనున్నాయి.. ఫస్ట్ క్లాస్ జర్నీ టికెట్ ధర 50 శాతం తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది… తగ్గించిన ధర ఈనెల 5వ తేదీ నుండి అమలు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ – ఫలక్ నుమా – […] -
COVID 19: కొత్త వేరియంట్ కలకలం.. భారత్లో తొలి కేసు నమోదు
కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది.. భారత్లో మరి కొత్త వేరియంట్ కేసు నమోదు అయ్యింది.. కోవిడ్ ఎక్స్ఈ వేరియంట్కు సంబంధించిన తొలి కేసు భారత్లో వెలుగుచూసినట్టు జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సోర్టియమ్(ఐఎన్ఎస్ఏసీవోజీ), సార్స్ సీవోవీ2 వైరస్కు చెందిన బులిటెన్ను విడుదల చేసింది.. అయితే, భారత్లో నమోదైన తొలి ఎక్స్ఈ వేరియంట్ కేసు ఎక్కడ వెలుగు చూసింది అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక, గత వారంతో పోలిస్తే, 12 […] -
Revanth Reddy: వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం
తెలంగాణలో వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని తెలిపారు తెలంగాణ పీసీసీ చీప్ రేవంత్రెడ్డి.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారాయన.. ఈ సందర్భంగా ఎన్నికలు, అధికారం గురించి మాట్లాడుతూ.. 2023 నుంచి 2033 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 94 నుంచి 2004 టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ పార్టీలు పదేళ్లు అధికారంలో […] -
KA Paul: కేటీఆర్కు వార్నింగ్.. నువ్వు పుట్టకముందే ప్రపంచాన్ని వణికించా..
తెలంగాణ మంత్రి కేటీఆర్కు వార్నింగ్ ఇచ్చారు కేఏ పాల్.. నువ్వు పుట్టకముందు నేను ప్రపంచాన్ని వణికించానన్నారు.. తనపై దాడి తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈరోజు చీకటి రోజు అన్నారు.. కేసీఆర్, కేటీఆర్ గుండాలతో రాష్ట్రాన్ని నడుపుతున్నారు.. చాలా మంది పోలీస్ కమిషనర్లు, అధికారులు కేసీఆర్ చెప్పినట్టు పనిచేస్తున్నారని ఆరోపించారు. మధ్యాహ్నం 3:30 కి ఈరోజు ఎస్పీకి కేటీఆర్ కాల్ చేసి, కేఏ పాల్ ని రానివ్వకండి అన్ని […] -
Prashant Kishor : కొత్త పార్టీతో పీకే సక్సెస్ అవుతారా..?
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు పీకే. తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ట్వీట్ చేశారు. త్వరలో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నానని.. పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నానని తెలిపారు. పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందించానని.. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పని చేశానని చెప్పారు పీకే. తన సొంత రాష్ట్రం బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టనున్నారు. జన్ సురాజ్ పేరిట […]
తాజావార్తలు
-
Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
-
He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
-
Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
-
Mega 158: డాడీ కోసం పెద్ది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!