Vijayashanti: బీజేపీ గెలిచిన భయంతోనే కేసీఆర్ ఆస్పత్రికి..!
నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలవగానే భయంతో సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారని ఎద్దేవా చేశారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఒక్కొక్కరు మిసైల్ లాంటి వారు.. మహిళలు కోరుకునేది సమాజంలో గౌరవం.. మహిళ అంటే భాధ్యత.. భాధ్యత అంటే మహిళ అన్నారు.. సభ్యత, సంస్కారం నేర్పించేది మహిళ.. సమాజంలో డ్రగ్స్ కి బానిసై యువత… తల్లి, చెల్లి అనే బేధం లేకుండా మానభంగాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. డ్రగ్స్ కల్చర్ వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే అని ఆరోపించిన ఆమె.. మద్యం సేవించి బానిసై అడబిడ్డలని, హత్యలు, మానభంగాలు చేస్తున్నారని.. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా? అని ప్రశ్నించారు.
Read Also: Uttarakhand: కొత్త సీఎం ఆమెనా..?
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
రాష్ట్రంలో సెక్యూరిటీ లేక మహిళలు బిక్కు బిక్కు మని జీవిస్తున్నారని వ్యాఖ్యానించారు విజయశాంతి.. ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదన్నారు.. యూపీలో భద్రత లేని చోట ప్రధాని మోడీ, సీఎం యోగి భద్రత కల్పించారన్న ఆమె.. ఇప్పుడు యూపీ మాఫియా చేతుల్లో లేదన్నారు. యూపీలో రెండో సారి గెలిచింది అంటే మంచి పనులు చేయడం వల్లనే అని స్పష్టం చేసిన ఆమె.. అపవిత్రంగా వున్న రాష్ట్రాన్ని యోగీ ప్రభుత్వం కడిగి పవిత్రం చేసిందన్నారు.. కానీ, ఈ (తెలంగాణ) రాష్ట్రంలో అలాంటి ప్రభుత్వం లేదని విమర్శించారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది.. ఏ పార్టీ ఇప్పుడు చేసే పనిలో లేదన్నారు. తప్పులు చేసిన ప్రభుత్వం పాతాళంలోకి పోతుందన్నారు. ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ దొంగ మాటలు చెబుతున్నారని ఆరోపించిన విజయశాంతి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందనే భయంతో ఆస్పత్రిలో పడుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
ఇక, ముందు ప్రజలు మారాలని సూచించారు విజయశాంతి.. గత ఐదేళ్లలో ఇస్తానన్న పతకాలు ఏమిచేయలేదని విమర్శించారు. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని.. రెండు వేలు, మూడు వేలు ఇచ్చి మాయ చేస్తున్నాడని మండిపడ్డారు.. ఈ రాష్ట్రం బాగు పడాలంటే మీ చేతుల్లోనే వుంది.. మీకు చెప్పడం మా డ్యూటీ.. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం మీ డ్యూటీ.. మొత్తంగా రాష్ట్రంలో మార్పు అవసరం అన్నారు. మీరు బాగుండాలి తప్ప… ఇందులో నా స్వార్థం లేదన్న ఆమె.. ఆ నాలుగు రాష్ట్రాల్లో మహిళలు, యువత ఓట్లతో బీజేపీ గెలుపు సాధ్యమైంది.. మీరు లబ్ధి పొందండి.. టీఆర్ఎస్ను తుంగలో తొక్కిండి అని పిలుపునిచ్చారు. మగవాళ్లు మహిళలను గౌరవించాలని సూచించారు విజయశాంతి.. ఇంట్లో వారినే కాదు సమాజంలోని మహిళలను కూడా గౌరవంగా చూడాలి.. ఈ ప్రభుత్వ మారితెనే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!