Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి కీలక వ్యాఖ్యలు.. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాయకత్వ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సమావేశమైన సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ… ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ తాము రాజీనామాకు సిద్ధమన్న ఆమె ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించింది.. ఇక, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా.. పార్టీ కోసం గాంధీ కుటుంబం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అని ప్రకటించారు.. వ్యక్తుల కన్నా పార్టీయే ముఖ్యం అని స్పష్టం చేసిన ఆమె.. గాంధీ కుటుంబం వల్లే పార్టీ బలహీన పడిందని భావిస్తున్నారు.. కొందరు నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నారు. సీడబ్ల్యూసీ సమావేశం కోరితే.. తాము రాజీనామా చేసేందుకు సిద్ధమని తెలిపారు సోనియా గాంధీ.
Read Also: CWC Meeting: రాజీనామాకు సిద్ధపడిన సోనియా గాంధీ
Also Read
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
- Ayodhya: "వాష్రూమ్లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
అయితే, సోనియా గాంధీయే పార్టీ చీఫ్గా కొనసాగుతారని ఇవాళ జరిగిన కీలక సమావేశం తేల్చేసింది.. ఐదు రాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఘోర ఓటమిపై నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించింది సీడబ్ల్యూసీ.. ఐదు రాష్ట్రాల్లో గాంధీ కుటుంబంపై తీవ్ర విమర్శలు, సమగ్ర మార్పులు, నాయకత్వ మార్పుపై చర్చ సాగింది.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా మాకు నాయకత్వం వహిస్తారు.. భవిష్యత్ చర్యలు తీసుకుంటారు, ఆమె నాయకత్వంపై మా అందరికీ నమ్మకం ఉంది అని పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ఆ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, చిదంబరం తదితరులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి హాజరైన వారిలో ఉన్నారు. కాగా, కాంగ్రెస్ పంజాబ్లో ఆమ్ ఆద్మీ చేతిలో ఓడిపోయింది, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్లను బీజేపీ నుండి కైవసం చేసుకోలేకపోయింది.. ఇక, రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్లో పార్టీ సంఖ్య అత్యల్ప స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..