Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి కీలక వ్యాఖ్యలు.. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాయకత్వ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సమావేశమైన సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ… ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ తాము రాజీనామాకు సిద్ధమన్న ఆమె ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించింది.. ఇక, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా.. పార్టీ కోసం గాంధీ కుటుంబం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అని ప్రకటించారు.. వ్యక్తుల కన్నా పార్టీయే ముఖ్యం అని స్పష్టం చేసిన ఆమె.. గాంధీ కుటుంబం వల్లే పార్టీ బలహీన పడిందని భావిస్తున్నారు.. కొందరు నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నారు. సీడబ్ల్యూసీ సమావేశం కోరితే.. తాము రాజీనామా చేసేందుకు సిద్ధమని తెలిపారు సోనియా గాంధీ.
Read Also: CWC Meeting: రాజీనామాకు సిద్ధపడిన సోనియా గాంధీ
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
అయితే, సోనియా గాంధీయే పార్టీ చీఫ్గా కొనసాగుతారని ఇవాళ జరిగిన కీలక సమావేశం తేల్చేసింది.. ఐదు రాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఘోర ఓటమిపై నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించింది సీడబ్ల్యూసీ.. ఐదు రాష్ట్రాల్లో గాంధీ కుటుంబంపై తీవ్ర విమర్శలు, సమగ్ర మార్పులు, నాయకత్వ మార్పుపై చర్చ సాగింది.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా మాకు నాయకత్వం వహిస్తారు.. భవిష్యత్ చర్యలు తీసుకుంటారు, ఆమె నాయకత్వంపై మా అందరికీ నమ్మకం ఉంది అని పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ఆ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, చిదంబరం తదితరులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి హాజరైన వారిలో ఉన్నారు. కాగా, కాంగ్రెస్ పంజాబ్లో ఆమ్ ఆద్మీ చేతిలో ఓడిపోయింది, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్లను బీజేపీ నుండి కైవసం చేసుకోలేకపోయింది.. ఇక, రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్లో పార్టీ సంఖ్య అత్యల్ప స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!