Ukraine crisis: భారత రాయబార కార్యాలయం తరలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మరింత ఉధృతంగా సాగుతోంది.. ఉక్రెయిన్లో రష్యా మారణహోమం సృష్టిస్తోంది.. పోలాండ్ సరిహద్దు సమీపంలోని యవరీవ్ను టార్గెట్ చేసింది రష్యా.. మిలటరీ ట్రైనింగ్ క్యాంపుపై మిస్సైల్లో దాడులకు పూనుకుంది.. రష్యా దాడుల్లో తాజాగా 35 మంది మృతిచెందగా.. 134 మందికి పైగా గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఇక, మరో మేయర్ను కూడా కిడ్నాప్ చేసింది రష్యా సైన్యం, తాజాగా మెలిటోపోల్ మేయర్ను రష్యా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.. దీంతో ఇప్పటి వరకు కిడ్నాప్నకు గురైన మేయర్ల సంఖ్య రెండుకు చేరింది. ఉక్రెయిన్ పశ్చిమ భాగానికి కూడా రష్యా సైనిక చర్యలు విస్తరిస్తున్నాయి.. ఇవనోవ్ ఫ్రాంకోవిస్క్ మిలటరీ ఎయిర్బేస్పై క్షిపణులతో దాడులు చేశారని.. ఉక్రెయిన్లోనే అతిపెద్ద సైనిక శిక్షణ కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ దాడుల్లో లుట్స్క్ ఎయిర్ పోర్టు బాగా దెబ్బతింది. ఉక్రెయిన్లోని సాంస్కృతిక కేంద్రమైన ల్వీవ్ నగరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఉంది. వేలాది మంది ఉక్రెయిన్లు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా ల్వీవ్పై కూడా దాడులు జరగడంతో మరో సురక్షిత స్థానం కోసం పరుగులు తీస్తున్నారని ఉక్రెయిన్ మిలటరీ వెల్లడించింది.. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: Hyderabad: హైదరాబాద్లో కలకలం.. కుక్క నోట్లో బాలుడి తల..
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
క్రమంగా ఉక్రెయిన్లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారత రాయాబార కార్యాలయాన్ని తాత్కాలికంగా ఉక్రెయిన్ నుంచి తరలించాలని నిర్ణయానికి వచ్చింది.. భారత రాయబార కార్యాలయాన్ని ఉక్రెయిన్ నుంచి పొరుగున ఉన్న పోలాండ్కి తరలించినట్లు కేంద్రం పేర్కొంది.. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలపై దాడుల నేపథ్యం.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరియు అనేక ఇతర ప్రముఖ నగరాలపై రష్యా దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత పభ్రుత్వం తెలిపింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!