Fog: వేసవిలోనూ దట్టమైన పొగమంచు.. ఏం వాతావరణ మార్పులో ఏమో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fog: వేసవి కాలం మధ్యలోనూ గోదావరి జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా రాజమండ్రిలో ఉదయం వేళ గోదావరి నదిపై విస్తరించిన దట్టమైన పొగమంచు కారణంగా పరిసర ప్రాంతాలు పూర్తిగా కనిపించని పరిస్థితి నెలకొంది. గోదావరి నదిపై ఉన్న రోడ్ కం రైల్వే బ్రిడ్జి, హేవలక్ బ్రిడ్జి, ఆర్చి బ్రిడ్జి పొగమంచుతో పూర్తిగా కప్పుకుపోయాయి. దీంతో రోడ్ కం రైల్వే బ్రిడ్జి పై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా స్పష్టంగా కనిపించకపోవడంతో డ్రైవర్లు నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది.
Read Also: AP Cabinet 2026: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపులకు ఆమోదం!
Also Read
ఇక, ఉదయం గోదావరి ఘాట్లకు వెళ్లే భక్తులు, అలాగే గోదావరి బండపై వాకింగ్ చేసే వారు ఈ అరుదైన దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. సాధారణంగా శీతాకాలంలో కనిపించే పొగమంచు, వేసవిలో కూడా ఇలా కమ్ముకోవడం అరుదైన విషయమని వారు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఉదయం 7 గంటలైనప్పటికీ పొగమంచు పూర్తిగా తొలగకపోవడం గమనార్హం. దీనివల్ల కొంతసేపు ట్రాఫిక్ కూడా నెమ్మదించింది. పర్యావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగానే ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు భావిస్తున్నారు. ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు, తేమ శాతం పెరగడం వంటి కారణాల వల్లే వేసవిలో కూడా పొగమంచు ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
-
TVK Vijay: విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు.. ఎప్పుడంటే..!
-
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
-
Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ
-
Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!