తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థల నుంచి, పలు దేశాల నుంచి ఆహ్వానాలు అందుకున్నారు. ప్రతిష్టాత్మక సంస్థల ఆహ్వానాలు అందుకుని.. వారి కోరిక మేరకు వివిధ చర్చల్లో పాల్గొన్నారు.. తాజాగా. ఆయనకు కజకిస్తాన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. కజకిస్తాన్ వేదికగా జరిగే 2022 డిజిటల్ బ్రిడ్జి ఫోరమ్ సదస్సుకు రావాలంటూ ఆయనను ఆహ్వానించారు.. ఈ నెల 28, 29 తేదీల్లో బ్రిడ్జ్ ఫోరమ్ సదస్సు జరగబోతోంది… ఈ సదస్సుకు గౌరవ అతిథిగా రావాలని […]
మనం వాడే బైక్, కారు.. చివరకు సైకిల్ అయినా సక్రమంగా పనిచేయాలంటే.. వాటికి రెగ్యులర్గా సర్వీస్ చేయించడం.. ఇంజిన్ ఆయిల్ మార్చడం.. టైర్లలో గాలి పెట్టించడం.. చెడిపోయిన పాట్లు మారుస్తూ ఉండడంతో ఎలా చేస్తామో.. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కూడా అలాంటి పనిచేయాలి.. ముఖ్యంగా రోజువారి వ్యాయామంతో అనేక అనారోగ్యసమస్యలు దూరం అవుతాయి.. ఆయుష్ఫు కూడా పెరుగుతుందని అనేక సర్వేలు పేర్కొన్నాయి.. తాజాగా.. ఏకంగా 30 ఏళ్ల పాటు నిర్వహించిన ఓ అధ్యయనం ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.. […]
దసరా పండుగ సందర్భంగా ఈ సారి విద్యార్థులకు భారీగా సెలవులు దొరకనున్నాయి.. తెలంగాణలో పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు సర్క్యులర్ పంపించింది… సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 8 వరకు దసరా సెలవులను ప్రకటించింది. వచ్చే నెల 5న దసరా పండుగ ఉండగా.. అందుకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నెల […]
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తాగి ఫ్లైట్ ఎక్కారని.. దాంతో విమాన సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు.. విమానం నుంచి దించేశారు.. ఈ పరిణామాలతో విమానం ఆలస్యంగా బయల్దేరిందంటూ.. రకరకాల ప్రచారాలు జరిగాయి.. అయితే, దీనిపై పౌర విమానయాన శాఖ విచారణ చేపట్టింది.. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో ఢిల్లీ వెళ్లే విమానంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. తాగి ఉన్నారనే ఆరోపణలపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టనున్నట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.. పంజాబ్ సీఎం […]
WhatsApp: ఎప్పటికప్పుడు తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్.. ఇప్పుడు మరో కొత్త అదిరిపోయే ఫీచర్ను అందుబాటులోకి తెస్తోంది.. ఇప్పటి వరకు వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పెడితే.. దానిని మార్చాలంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు.. పాతది డెలిట్ చేసి.. మార్పులు చేస్తూ.. మరో కొత్త మెసేజ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి.. అయితే.. ఆ కష్టాలకు చెక్ పెడుతూ.. త్వరలో ఓ నయా ఫీచర్ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది వాట్సాప్… ‘ఎడిట్ మెసేజ్స్’ ఫీచర్ పేరుతో […]
సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.. అవకాశం దొరికితే ప్రతిష్టాత్మక సంస్థలను కూడా వదలడంలేదు.. తాజాగా, హైదరబాద్ కంచన్బాగ్ లోని మిధాని సంస్థకు రూ. 40 లక్షలు టోకరా వేశారు సైబర్ క్రైమ్ నేరస్థులు… మిథాని సంస్థ.. కెనడాకు చెందిన నేచురల్ ఆలూ కంపెనీ దగ్గర నుంచి అల్యూమినియం కొనుగోలు చేసింది.. అయితే, అల్యూమినియం కొనుగోలుకు మిథాని సంస్థ కొంత నగదును అడ్వాన్స్ గా చెల్లించింది… నేచురల్ అలూ కంపెనీ ఒప్పందం ప్రకారం మిథాని సంస్థకు అల్యూమినియం అందించింది… […]
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది… ఎల్లుండి కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.. ఇక, ఈ నెల 24వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా… అక్టోబర్ 17వ తేదీన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. అయితే.. తాజా పరిణామాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.. ఓవైపు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానం చేస్తూ వస్తున్నాయి పలు రాష్ట్రాల పీసీసీలు.. కానీ, గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది జీ […]
నేను ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డను అయితేనే కేసు పెడితేనే తీసుకోవడం లేదు.. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఎంటి..? ఇదేనా తెలంగాణలో మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల.
యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది.. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తున్నట్టు ప్రకటించింది.. ఇక, సవరించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 20, 2022 నుంచి అంటే ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి.. యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు మారిన విధానాన్ని గమనిస్తే.. 2 కోట్ల రూపాయలలోపు ఎఫ్డీలపై 2.75 శాతం నుండి 5.75 శాతం వరకు రేట్లు అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఈ రేటు 2.75 శాతం నుండి […]
దసరా పండుగ సమయంలో ప్రయాణికులకు శుభవార్త వినిపించింది ఆర్టీసీ. ఈ నెల 29 వ తేదీ నుంచి వచ్చే నెల 10 వ తేదీ వరకు విజయవాడ దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.