భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది… మూడో విడతలో 11 నియోజకవర్గాలు, 5 జిల్లాల గుండా ఆయన పర్యటన సాగింది.. ఈ సారి 300.4 కిలోమీటర్లను చేరుకోవడంతో యాత్ర ముగియనుంది.. మొత్తంగా 3 విడతల్లో కలుపుకేంటే 1121 కిలోమీటర్లు, 18 జిల్లాలు, 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంజయ్ పాదయాత్ర సాగింది… వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు చేరుకోవడంతో మూడో విడత పాదయాత్ర ముగినుంది.. […]
తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని.. వచ్చే ఎన్నికల్లో విజయం మాదేనని బల్లగుద్ది చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.. నాగార్జున సాగర్ మినహా.. వరుసగా ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో.. క్రమంగా తమ గ్రాప్ పెరుగుతుంది అంటున్నారు. కాషాయం పార్టీ అగ్రనేతలు వరుసగా తెలంగాణను చుట్టేస్తున్నారు.. హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించి.. ఆ తర్వాత భారీ బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ […]
ఖమ్మం జిల్లా తల్లంపాడు దగ్గర పెట్రోల్ ట్యాంకర్ అదుతప్పి నిలిచిపోయింది.. అయితే, పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడకుండా.. డ్రైవర్ కంట్రోల్ చేయగలిగాడు.. కానీ, ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బకెట్లు, క్యాన్లు, డబ్బాలతో ఎగబడ్డారు.. నేనంటే.. నేను అంటూ పోటీపడ్డారు.. ట్యాంకర్ నుంచి పెట్రోల్ ఖాళీ చేశారు.. అయితే, ట్యాంకర్ నుంచి కారిపోతున్న పెట్రోల్ను అదుపుచేయడానికి, పెట్రోల్ తీసుకెళ్తున్న జనాన్ని కంట్రోల్ చేయడానికి కొద్ది సేపు ప్రయత్నం చేశాడు డ్రైవర్.. పెద్ద ఎత్తున జనం రావడంతో.. అదుపు […]
ముందుగా నిర్ణించిన ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ఈ నెల 23వ తేదీనే ప్రారంభం కావాల్సింది ఉంది.. అయితే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే రాజాసింగ్ ఎఫెక్ట్తో అవి చివరి నిమిషంలో వాయిదా వేశారు అధికారులు.. రాజాసింగ్ ఓ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో.. దీంతో.. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాయిదా పడిన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఈరోజు ఉదయం 11 […]
గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే కాలుష్య కారకాలను తగ్గించడానికి చర్యలకు నడుం బిగిస్తున్నాయి ఆయా దేశాలు.. ఇప్పటికే కొన్ని దేశాల్లో డీజిల్ వాహనాలపై నిషేధాలు అమలుల్లోకి రాగా.. పెట్రోల్తో నడిచే వాహనాలపై కూడా నిషేధాన్ని విధించేందుకు సిద్ధం అవుతున్నాయి కొన్ని దేశాలు.. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన కాలిఫోర్నియా.. పెట్రోల్ కార్లపై నిషేధాన్ని ప్రకటించింది.. 2035 నుండి మార్కెట్లోకి వచ్చే కార్లు జీరో కాలుష్యాన్ని కలిగి ఉండాలని కాలిఫోర్నియా నిర్ణయం తీసుకుంది.. విస్తృతంగా ప్రచారం చేయబడిన ఈ […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=yqKCsIMSFEQ
మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా… హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇదే సమయంలో.. టాలీవుడ్ హీరో నితిన్తో పాటు.. మహిళా క్రికెటర్ మిథాలీరాజ్తో సమావేశం కానుండడం హాట్ టాపిక్గా మారిపోయింది.. ఇవాళ ఉదయం 11:45 గంటలకు సతీసమేతంగా జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.. మొదట నోవాటెల్ హోటల్కు వెళ్లనున్నా […]
రైతు సంఘాల నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. పంజాబ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ నుంచి వచ్చిన 100 మంది రైతు సంఘాల నేతలు కేసీఆర్ను కలవనున్నారు.. ఇప్పటికే గౌరారం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన అటవీ ప్రాంతాన్నిపరిశీలించిన రైతు సంఘాలు ప్రతినిధులు, మల్లన్నసాగర్, టాంక్ బండ్, పంప్ హౌజ్ను పరిశీలించారు.. ఇవాళ జాతీయ రైతు సంఘం నేత టికాయత్ సహా మరి కొంతమంది నేతలతో సమావేశం కానున్నారు కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ రైతు […]
ఢిల్లీలో పొలిటికల్ హీట్ మొదలైంది.. ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షోభంలో పడనుందా..? అనే చర్చ మొదలైంది.. సీఎం కేజ్రీవాల్తో నిర్వహించిన కీలక భేటీకి చాలా మంది ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంపై… అనుమానాలు రేగుతున్నాయి. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని సీబీఐ, ఈడీ సోదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ పాలసీ స్కామ్లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలో ఆప్ ఎమ్మెల్యేలను సమావేశానికి పిలిచారు సీఎం కేజ్రీవాల్. ఎమ్మెల్యేలందరినీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం […]