Congress president election: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది… ఎల్లుండి కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.. ఇక, ఈ నెల 24వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా… అక్టోబర్ 17వ తేదీన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. అయితే.. తాజా పరిణామాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.. ఓవైపు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానం చేస్తూ వస్తున్నాయి పలు రాష్ట్రాల పీసీసీలు.. కానీ, గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది జీ 23.. అయితే, దేశవ్యాప్తంగా వరుస ఓటములు.. సీనియర్లు, కీలక నేతల రాజీనామాల నేపథ్యంలో.. ఏఐసీసీ పీఠానికి జరగనున్న ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది.
Read Also: Nandamuri Balakrishna: సత్తి రెడ్డి.. ‘చెన్నకేశవరెడ్డి’ మళ్లీ వస్తున్నాడు.. సిద్దమేనా..?
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
అయితే, 1998 నుంచి ఇప్పటివరకు సుదీర్ఘ కాలం సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ వచ్చారు.. మధ్యలో అంటే.. 2017లో రాహుల్ గాంధీకి బాధ్యతలు అప్పగించినా.. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత బాధ్యతల నుంచి తప్పుకున్నారు రాహుల్.. దీంతో.. మళ్లీ సోనియానే పగ్గాలు తీసుకున్నారు.. సుదీర్ఘ కసరత్తుల తర్వాత అధ్యక్ష ఎన్నికలకు సిద్ధం అవుతోంది పార్టీ.. ఈనెల 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 24 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి 19న కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు.. దీంతో, బరిలోకి దిగేది ఎవరు? ఆ అవకాశం ఉందా? వరుసగా కొన్ని రాష్ట్రాల పీసీసీలు.. రాహుల్నే పార్టీ చీఫ్ను చేయాలంటూ తీర్మానాలు చేస్తున్న తరుణంలో.. ఏం జరగబోతోంది? అనే ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. మరో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కూడా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో సోనియాగాంధీతో శశిథరూర్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ కోసమే ఆయన భేటీ అయ్యారని పార్టీవర్గాలు చెబుతున్నమాట.. ఓవైపు.. భారత్ జోడో యాత్రతో ప్రజల మధ్య రాహుల్ గాంధీ ఉన్న సమయంలో వస్తున్న ఈ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!