Civil aviation ministry: తాగి ఫ్లైట్ ఎక్కిన సీఎం..! విచారణకు కేంద్రం ఆదేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తాగి ఫ్లైట్ ఎక్కారని.. దాంతో విమాన సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు.. విమానం నుంచి దించేశారు.. ఈ పరిణామాలతో విమానం ఆలస్యంగా బయల్దేరిందంటూ.. రకరకాల ప్రచారాలు జరిగాయి.. అయితే, దీనిపై పౌర విమానయాన శాఖ విచారణ చేపట్టింది.. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో ఢిల్లీ వెళ్లే విమానంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. తాగి ఉన్నారనే ఆరోపణలపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టనున్నట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎయిర్పోర్ట్ వివాదంపై కేంద్రం దృష్టిసారించింది.. మద్యం మత్తులో ఉన్న మాన్ణు విమానం నుంచి దించేశారని వచ్చిన ఆరోపణలను పరిశీవలిస్తున్నాం.. ఈ ఘటనపై నిజానిజాలు తేల్చడం ముఖ్యమని పేర్కొన్నారు..
Read Also: WhatsApp: వాట్సాప్లో మరో అదిరిపోయే ఫీచర్..
Also Read
- Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
అయితే, ఈ ఘటన విదేశాల్లో జరిగింది కాబట్టి.. దానిపై నిజాలు నిర్ధరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు సింధియా.. ఈ ఘటనపై సంబంధిత ఎయిర్పోర్ట్ నుంచి వివరాలు కోరతాం.. కానీ, సమాచారం ఇవ్వాలా లేదా అనే విషయం ఎయిర్లైన్స్ పరిధిలోనేది అన్నారు.. నాకు అందిన విజ్ఞప్తి ప్రకారం.. ఈ విషయంపై దృష్టిసారిస్తున్నట్టు తెలిపారు.. కాగా, జర్మనీ పర్యటనకు వెళ్లిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. ఆదివారం తిరిగి భారత్కు వచ్చారు.. కానీ, ఆయన ప్రయాణించిన విమానం ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది.. దీనిపై ఆరోపణలు వచ్చాయి.. పంజాబ్ సీఎం.. ఢిల్లీకి తిరిగి వస్తుండగా విమానం నుంచి దించేశారంటూ.. శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆరోపణలు గుప్పించారు.. దీంతో, ఇది చర్చగా మారిపోయింది.. మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో మాన్ ఉన్నారని… ఆ విషయాన్ని ఆ విమానంలో సీఎం మాన్తో ప్రయాణించిన తోటి ప్రయాణికులు తనకు తెలిపారంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.. ఇక, సీఎం పదవికి మాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.. ఆ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలని పౌర విమానయాన శాఖ మంత్రి సింధియాకు లేఖ రాశారు కాంగ్రెస్ నేత.. మరోవైపు.. ఈ ఆరోపణలను ఆమ్ఆద్మీ పార్టీ ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది.. సీఎం మాన్ షెడ్యూల్ ప్రకారమే తిరిగి వచ్చారు స్పష్టం చేసింది. అంతేకాదు.. ట్విట్టర్ వేదికగా లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ స్పందిస్తూ.. ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని మార్చడం వల్లే ప్రయాణం ఆలస్యమైందని వివరించింది.. ఓ ప్రయాణికుడు మత్తులో ఉండటం వల్లే ఆలస్యమైనట్లు వచ్చిన వార్తలను మాత్రం ఖండించింది… ఇప్పుడు ఈ ఘటనపై విచారణ చేపట్టనుండడంతో.. ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయి.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చిక్కుల్లో పడతారా? అనేది చర్చగా మారింది.
తాజావార్తలు
-
Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!