Dasara special buses: దసరా వేళ శుభవార్త చెప్పిన ఆర్టీసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా పండుగ వచ్చేస్తోంది… ఈ సమయంలో ప్రయాణికులకు శుభవార్త వినిపించింది ఆర్టీసీ. ఈ నెల 29 వ తేదీ నుంచి వచ్చే నెల 10 వ తేదీ వరకు విజయవాడ దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదారాబాద్ , చెన్నై మరియు బెంగళూరు ప్రాంతాల నుంచి విజయవాడకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది.. అంతేకాకుండా విజయవాడ నుంచి విశాఖ, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, తిరుపతి, భద్రాచలం, రాయలసీమ ప్రాంతాలకు సైతం ఈ దసరాకు బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. గత రెండేళ్లుగా కోవిడ్తో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్లు.. సొంతూళ్లకు దూరం అయ్యారు. అంతేకాదు కోవిడ్ నిబంధనలతో దసరా ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుండి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులు తక్కువ అయిన పరిస్థితి. ప్రస్తుతం కరోనా భయం తోలగటంతో ఈ సారి ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు సంఖ్య అధికంగానే ఉంటుందని భావించిన అధికారులు ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. పండుగల వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయటం మామూలే… దీనిని సైతం దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బంది కలుగకుడదు అనే ఉద్దేశ్యంతో మొత్తం 1,081 బస్సులను హైదారాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి విశాఖ, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, తిరుపతి, భద్రాచలం ప్రాంతాలకు షటిల్ ట్రిప్పులను నడపనుంది ఆర్టీసీ.
Read Also: RBI Orders: అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
అయితే, ప్రత్యేక బస్సులు అనగానే ప్రత్యేక చార్జీలు అనే ప్రచారం ఉన్న నేపథ్యంలో.. ప్రత్యేక బస్సుల పేరుతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయటం లేదని ఆర్టీసీ ప్రకటించింది. దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో సాధారణ చార్జీలతోనే ప్రయాణం చేయొచ్చని ప్రకటించింది. దీంతో ప్రయాణికులకు ఈ విషయం కలిసొచ్చే అంశంగానే చెప్పచ్చు. వీరికి రిజర్వేషన్ సౌకర్యన్ని కల్పించారు. మరోవైపు ఈ నెల 26 నుంచి దసరా పండుగ ముగిసే వరకు విజయవాడ వైపు నడిచే రైళ్లలో రిజర్వేషన్లు నిండిపోయాయి.. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భారీ స్ధాయిలోనే వుంది.. దసరాకు విజయవాడ వైపు మరికొన్ని ఎక్కువ సర్వీసులు నడిపితే ప్రయాణికుల రద్దీని మరింతా తగ్గే అవకాశం వుంటుంది. మరోవైపు.. ప్రత్యేక రైళ్ల ప్రస్తావన ఇంకా రైల్వే అధికారులు ప్రకటించాలేదు. గతంలో కోవిడ్ దృష్ట్యా స్వల్ప సర్వీసులనే తిప్పింది.. ఈసారి విజయవాడ దుర్గమ్మను దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగానే వుంటుంది. దీంతో రైల్వే ప్రత్యేక సర్వీసులు నడిపితే తప్ప రద్దీని నియంత్రించటం కష్టమే అని చెప్పాలి… ప్రస్తుతం దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..