ఈ నెలలో ఏకంగా 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.. కొన్ని రాష్ట్ర-నిర్దిష్ట బ్యాంకు సెలవులతో పాటు మరికొన్ని ఉన్నాయి. సెప్టెంబర్ 2022లో, వారాంతాలతో సహా 13 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=UiM_h5L6F7s
ఆసియా కప్లో ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. అసలు సిసలైన మ్యాచ్కి సమయం ఆసన్నమైనది.. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్… యుఏఈ వేదికగా తలపడనున్నాయి… దాయాది జట్ల మధ్య రసవత్తర పోరు జరిగితే ఆ మ్యాచ్.. ఓ చిన్న యుద్ధంలాగే ఉంటుంది. ఎప్పుడూ క్రికెట్ చూడనివారు కూడా.. ఈ మ్యాచ్ చూసి తీరుతుంటారు.. అభిమానుల కోలాహోలం మధ్య ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే రాజకీయ కారణాల వల్ల ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగనప్పటికీ.. ఐసీసీ టోర్నీ, […]
తెలంగాణలో ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష జరగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించబోమని రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు అధికారులు. పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుంది. ఉదయం పది గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తామని తెలిపారు అధికారులు. పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, వాచీలు, క్యాలిక్యులేటర్ లాంటి ఎలక్ట్రానిక్ […]
* నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు * ఆసియాకప్లో నేడు పాకిస్థాన్తో తలపడనున్న భారత్, దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * నేడు హైదరాబాద్లో 11వ ఎడిషన్ మారథాన్.. నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వరకు మారథాన్, హైదరాబాద్ రన్నర్స్, ఎన్ఎండీసీ, ఐడీఎఫ్సీ ఆధ్వర్యంలో నిర్వహణ, మారథాన్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు, 42 కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఫుల్ మారథాన్ * నేడు తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష, ఉదయం […]
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. అందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చాలా సార్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.. ఇవాళ హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.. విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న నడ్డాకు.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్.. సహా మరికొందరు నేతలు స్వాగతం పలికారు.. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ […]
నా పేరు మీద కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడు..? అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను ఆవిష్కరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి.. విపక్షాల విమర్శలపై స్పందించారు.. నా పేరు మీద కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడు..? అని నిలదీసిన ఆయన.. మతం […]
బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్నారు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని నోవాటెల్ హోటల్లో మహిళా క్రికెటర్, మాజీ కెప్టెన్ మిథాల్రాజ్తో పాటు.. సినీ హీరో నితిన్తో భేటీకానున్నారు.. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింసభలో ఆయన పాల్గొననున్నారు.. అయితే, విపక్షాలపై, ముఖ్యంగా బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో ముందుండే తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇప్పుడు నడ్డా పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన సెటైరికల్ […]
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మాజీ చైర్మన్, ప్రొఫెసర్ గంటా చక్రపాణి… బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు.. ఇక, దేశంలో ఏ యూనివర్సిటీకి లేని ఆదరణ అంబేద్కర్ యూనివర్సిటీకి వచ్చిందన్నారు. పోటీ పరీక్షల్లో విజయానికి కేరాఫ్ అడ్రస్ గా అంబేద్కర్ […]
ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు భారతీయ జానతా పార్టీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా… మొదట శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రానున్న ఆయన.. ఎయిర్పోర్ట్ సమీపంలోని నోవాటెల్ హోటల్కు దాదాపు గంటకుపై గా ఉంటే.. మధ్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ లో బీజేపీ జాతీయ అధ్యక్షులు, ఎంపీ జేపీ నడ్డాతో భారత మహిళా క్రికెటర్, మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ సమావేశం కానున్నారు.. బీజేపీ ముఖ్యనేతలతో కూడా సమావేశం కానున్న జేపీ నడ్డా.. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించను్నారు.. ఇక, మధ్యాహ్నం […]