ప్రధాన నరేంద్ర మోడీని కలిసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు… ఆంధ్రప్రదేశ్లో పర్యటించాలని ఆహ్వానించారు.. ఈరోజు ఆయన కార్యాలయంలో ప్రధాని మోడీని కలిశారు రాజ్యసభ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు… అనేక ప్రతిష్టాత్మకమైన జాతీయ అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనకు రావాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్బంగా ప్రధానికి జీవీఎల్ స్వయంగా అందచేసిన లేఖలో విశాఖపట్నంలో పూర్తికానున్న పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రస్తావించారు.. వాటిపై ప్రధాని […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం పర్యటన ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.. బుధవారం నుంచి పలు చోట్ల టీడీపీ-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు, దాడులకు దారి తీసింది.. ఇక, ఇవాళ అన్నా క్యాంటీన్ ధ్వంసం, బంద్కు వైసీపీ పిలుపుతో మరింత టెన్షన్ నెలకొంది.. ఇక, కుప్పంలో టీడీపీ నేతలపై భారీగా కేసులు నమోదు చేశారు పోలీసులు.. రామకుప్పం మండలంలో టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.. మాజీ ఎమ్మెల్సీ […]
చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు ఆ శాఖకు తీరని మచ్చగా పేర్కొన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య.. కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరు అధికార పార్టీతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు..
రాష్ట్రాల అభివృద్ధికి సహకరించని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంత సిద్దం కావాలన్నారు చెన్నకేశవరెడ్డి. ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుపై ప్రశంసలు కురిపించారు.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఢీకొన్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆరే అన్నారు.
సీఎం వైఎస్ జగన్ అరాచక రాజకీయాలను కట్టిపెట్టాలని ఫైర్ అయ్యారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో చోటు చేసుకున్న పరిస్థితులపై స్పందించిన ఆయన.. ప్రతిపక్షనేత చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడే అన్నారు.. చంద్రబాబు పర్యటన సందర్భంగా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపర్చడం హేయమైన చర్యగా మండిపడ్డ ఆయన.. ఈ ఘటనకు సీఎం వైఎస్ జగన్, జిల్లా మంత్రి […]
తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల చూపు మునుగోడు ఉప ఎన్నికపైనే ఉంది.. కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీ చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. బీజేపీ నుంచి బరిలో దిగుతుండగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.. పలువురి పేర్లు తెరపైకి వస్తున్నా.. అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించింది లేదు.. మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ సభ వేదికగానే అభ్యర్థి పేరు ప్రకటిస్తారని అంతా భావించినా.. అభ్యర్థి […]
రాష్ట్రంలోని ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులతో పాటు.. అంగన్వాడీ సూపర్ వైజర్లు, అంగన్వాడీ వర్కర్, హెల్పర్ల పోస్టులను కూడా భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్
తన సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు.. కొన్ని ప్రాంతాల్లో.. చంద్రబాబు టూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శాంతిపురం మండలం, కొంగణపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వానికి శీతకన్ను వేసింది ఫైర్ అయ్యారు.. నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని ఇక్కడ ఏ పనులు చెయ్యడం లేదని ఆరోపించిన ఆయన.. ఈ చేతగాని ప్రభుత్వం… మిగిలిపోయిన హంద్రీ నీవా పనులు పూర్తి చేయలేదన్నారు.. నేను నాడు పులివెందులలో పంటలు ఎండిపోతుంటే సాగు నీరు […]
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొత్తగా ఫైల్ జంపింగ్ విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం… ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం లేకుండా ఉండేందుకు ఫైల్ జంపింగ్ విధానాన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్… ఈ మేరకు ఏపీ సెక్రటేరియట్ ఆఫీస్ మాన్యువల్ బిజినెస్ నిబంధనల్ని సవరణకు ఆమోదం తెలిపారు.. జీఏడీ ఇచ్చిన నోట్ ఆధారంగా సచివాలయ మాన్యువల్లో మార్పు చేర్పులు చేశారు.. సచివాలయంలో అనసవరమైన స్థాయిల్లో ఫైళ్లను తనిఖీ చేయటం అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.. సహాయ […]
ఢిల్లీ పర్యటన ఉన్న ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో సమావేశం అయ్యారు.. ఏపీలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరినట్టు ఆమె వెల్లడించారు.. ఇక, కేంద్రమంత్రి అన్ని సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సచివాలయం, విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్ ను కేంద్ర మంత్రి ప్రశంసించారని మీడియాకు తెలియజేశారు మంత్రి విడదల రజిని… ఈ అంశాన్ని కేంద్ర కేబినెట్ లో చర్చిస్తామన్నారని.. […]