టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని పొడిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ను కోరినట్లు సమాచారం. పదవీకాలాన్ని 2027 వన్డే వరల్డ్ కప్ వరకు పొడిగించాలని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ గెలిచిన వెంటనే అగార్కర్ ఈ మేరకు బీసీసీఐని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐలో చర్చలు జరుగుతున్నాయట. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై బీసీసీఐ, అగార్కర్ కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇప్పటికే ఐపీఎల్ 2025కు […]
తాను ఎక్కువ పూజలు చెయ్యను అని, కానీ ఒక నిమిషం సంకల్పం తీసుకుంటా అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అని, హిందువులకు పవిత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అని పేర్కొన్నారు. తనది దేవుడి దగ్గర ఒకటే సంకల్పం అని, అమరావతి దేవతల రాజధాని అవ్వాలని కోరుకున్నా సీఎం చెప్పుకోచ్చారు. ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్టసుఖాలు ఉంటాయన్నారు. ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పుకొచ్చారు. పండుగలు మనకు […]
మరో కొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సందడి మొదలు కానుంది. మార్చి 28న లీగ్ మొదటి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ట్రోఫీని నిలబెట్టుకుంటుందని జోస్యం చెప్పాడు. ఆర్సీబీ జట్టులో కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడి పైనే భారం ఉండబోదని డివిలియర్స్ స్పష్టం చేశాడు. ఆర్సీబీ […]
అమరావతిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కేంద్ర కార్యాలయంలో 2026 ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి సమేతంగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉగాది వేడుకల సందర్భంగా జగన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ప్రముఖ పండితుడు భాస్కర సుబ్రహ్మణ్య సిద్ధాంతి పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని […]
చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకూ పన్నెండు నెలలున్నాయి. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాసంలో సమశీతోష్ణకాలమైన వసంత ఋతువు ఆరంభమవుతుంది. జగత్తంతా చైతన్యవంతమయ్యే కాలమిది. మన బుద్ధి కూడా వికాసం పొందుతుంది. చిత్త నక్షత్రంతో దేహం చైతన్యవంతమవుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఏడాదిలో అత్యంత ఉత్సాహభరితమైన మాసం చైత్రమాసం. అందుకే ఉగాదినాడు ఆరు రుచులతో స్వాగతం పలుకుతాం. ఉగాది పండుగ తెలుగు వారందరికీ అత్యంత ముఖ్యమైన పండుగ. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, తెలుగు నూతన సంవత్సరానికి నాంది. […]
Nara Lokesh Urges Youth to Prepare For Govt Job: ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది 2026 సందర్భంగా శుభవార్త అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని […]
AP Job Calendar 2026 Released By Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. ఉగాది సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ జాబ్ క్యాలెండర్ను ప్రకటించగా.. వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. ఉగాది పర్వదినాన మంత్రి నారా లోకేశ్ ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్లో పాఠశాల మరియు ఇంటర్ […]
Virat Kohli Returns to RCB Ahead of IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెంగళూరుకు చేరుకున్నాడు. రావడమే ఆలస్యం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఆటగాళ్లతో కలసి ప్రాక్టీస్ ప్రారంభించాడు. కింగ్ రాకతో ఆర్సీబీలో కొత్త ఉత్సాహం వచ్చింది. విరాట్ ఇప్పుడు ఆర్సీబీ టైటిల్ డిఫెన్స్కు సిద్ధమవుతున్నాడు. గత సీజన్లో ఆర్సీబీ చారిత్రాత్మక విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర […]
ఉగాది పండగ పూట కర్కాటక రాశి వారికి అన్ని శుభాలే జరగనున్నాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు, వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. లాభాలతో కూడిన కార్యక్రమాలు, పనులు రూపొందించుకుంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేస్తే మంచిది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు రవాణా భారం తగ్గించేలా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘దివ్యాంగ శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో ఈ పథకాన్ని ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం అనంతరం సీఎం […]