అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం కంధాలపల్లిలో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లే సమయంలో స్థానికులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో రోడ్డుకు అడ్డంగా పెళ్లి పందిరి ఏర్పాటు చేయడంతో.. మృతదేహాన్ని ఆ మార్గంలో తీసుకెళ్లొద్దని కొందరు నిరోధించారు. బదులుగా బురదతో నిండిన రహదారి, పంట పొలాల మార్గం ద్వారా తీసుకెళ్లాలని హెచ్చరించడంతో రెండు సామాజిక వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. Also Read: […]
Highest Team Totals IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే అభిమానులకు గుర్తుకొచ్చేది భారీ సిక్సర్లు, పరుగుల వర్షం. ముఖ్యంగా ఇటీవల సీజన్లలో బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడుతూ రికార్డు స్థాయి స్కోర్లను నమోదు చేస్తున్నారు. టీ20 ఫార్మాట్లో 250కి పైగా స్కోర్లు సాధారణంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్లు నమోదు చేసిన జట్ల టాప్-10 జాబితా ఆసక్తికరంగా నిలిచింది. ఈ లిస్ట్ ఏంటో చూద్దాం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక […]
Most Maiden Overs in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే సాధారణంగా బ్యాటర్ల హవా ఎక్కువగా ఉంటుంది. భారీ సిక్సులు, ఫోర్లు, హై స్కోర్లు అభిమానులను అలరిస్తుంటాయి. కానీ ఈ మెగా లీగ్లో బౌలర్లు కూడా తమ అద్భుత ప్రతిభతో మ్యాచ్లను మలుపుతిప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మెయిడెన్ ఓవర్లు మ్యాచ్లో కీలక మలుపు తీసుకొస్తాయి. మెయిడెన్ ఓవర్లు వేయడం ద్వారా బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేసి జట్టుకు విజయాలు అందిస్తుంటారు. […]
Ruled Out Players in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు ప్రాంచైజీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కొందరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. మరికొందరు కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ప్లేయర్స్ గాయాలు జట్ల వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఐపీఎల్ 2026 ముందు గాయపడిన ప్లేయర్స్ లిస్ట్ ఓసారి చూద్దాం. ఐపీఎల్ 2026 ముందు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు […]
Former Palamaner MLA TC Rajan Ded at 106: చిత్తూరు జిల్లాలోని పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ చిన్న (టి.సి.) రాజన్ కన్నుమూశారు. 106 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్తతో పలమనేరులో విషాదం నెలకొంది. రాజకీయ ప్రముఖులు రాజన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ […]
Rashmika Calls Herself Telangana Kodalu at Gaddar Awards 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినీ పురస్కారాలు వరుసగా రెండో ఏడాది ఘనంగా ప్రదానం చేయడం విశేషం. తెలుగు సినిమా రంగానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన ఈ అవార్డులు గతంలో పలు కారణాలతో దాదాపు పద్నాలుగేళ్ల పాటు నిలిచిపోయాయి. అయితే గత ఏడాది నుంచి మళ్లీ ఈ పురస్కారాలను ప్రారంభించిన ప్రభుత్వం.. సినీ రంగంలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ ఉత్తమ చిత్రాల నిర్మాణానికి […]
తన భార్య వివాహేతర సంబంధాన్ని రుజువు చేయడానికి పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యపై ఆరోపణలను నిరూపించడానికి పిల్లలను పావులుగా ఉపయోగించడం సరైంది కాదని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు ఇతర ఆధారాలను సేకరించాల్సిందే గానీ, పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని కోరకూడదని తేల్చి చెప్పింది. Also Read: AP High […]
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చమురు శుద్ధి సంస్థలు ఎల్పీజీని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్కు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఎల్పీజీ కొరత ఉన్న సమయంలో చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయాలకు పాల్పడితే.. అది సామాన్య ప్రజలకు తీరని నష్టంతో పాటు కష్టాలను కలిగిస్తుందని కోర్టు […]
మేష, సింహ రాశుల వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మేష రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంటుంది. మేష రాశి వారికి నేడు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. స్వామి వారికి తులసి అర్చన నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సింహ రాశి వారికి అన్ని కలిసి రానున్నాయి. ఈ రెండు రాశుల వారికి నేడు ధనయోగం ఉంటుంది. కింది వీడియోలో మిగతా […]
బుధవారం కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల తాకిడి ఉమ్మడి కృష్ణా జిల్లా రైతాంగంపై పడింది ప్రధానంగా మైలవరం నియోజకవర్గంలో ములగ తోటలు పూర్తిగా నేలకొరిగాయి. ఎకరం రూ.40,000 ఖర్చుపెట్టి సాగు చేశామని.. ఇంకా చేతికి పంట రాకుండానే ములగ తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైలవరంలో ఉన్నటువంటి నాలుగు నుంచి ఆరు గ్రామాల్లో ఇదేవిధంగా ములగ తోటలు ఈదురు గాలుల దెబ్బకి రైతులకు నష్టాలను తెచ్చాయి. Also Read: Ajit […]