వాడుకోండి…. నా సేవల్ని బాగా ఉపయోగించుకోండి…. నా అనుభవాన్నంతా రంగరించి పార్టీని పైకి తెస్తానని ఆ వైసీపీ ఎంపీ చెబుతున్నా అస్సలు రెస్పాన్స్ ఉండటం లేదట. నువ్వు ఉండవయ్యా బాబూ…. అవసరమైనప్పుడు వాడతాంలే. టైమ్ వచ్చినప్పుడు మా వాడకం మామూలుగా ఉండదని అంటున్నా ఆ ఎంపీ మాత్రం అస్సలు తగ్గడం లేదట. హిట్ మీ హార్డ్ యార్ అంటున్న ఆ రాజ్యసభ సభ్యుడు ఎవరు? ఏంటా కథ? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద పొలిటికల్ రాశి, […]
ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato) మాతృ సంస్థ అయిన ఎటెర్నల్ (Eternal) కీలక నిర్ణయాలు తీసుకుంది. కంపెనీ మూడవ త్రైమాసిక (Q3) ఫలితాలను ప్రకటించడంతో పాటు, యాజమాన్య నిర్మాణంలో పెను మార్పులను చేపట్టింది. సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ సీఈఓ పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు కార్పొరేట్ రంగంలో హాట్ టాపిక్గా మారింది. ఎటెర్నల్ గ్రూప్ సీఈఓగా ఉన్న దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయన కంపెనీ నుంచి పూర్తిగా […]
భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు.. అందుకే దుబాయ్కు వెళ్ళిపోయానన్న రిమీ సేన్! బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధూమ్’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్గా మారిన నటి రిమీ సేన్. ‘హంగామా’, ‘గోల్ మాల్’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బెంగాలీ భామ, తెలుగులో చిరంజీవి సరసన ‘అందరివాడు’ మూవీలో కూడా నటించింది. కానీ గత కొంతకాలంగా వెండితెరకు పూర్తిగా దూరమైంది. 2011లో వచ్చిన ‘షాగీర్ద్’ ఆమె చివరి సినిమా. అయితే, ఆమె […]
Ayodhya: అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిస్సా భక్తులు అత్యంత అరుదైన, అద్భుతమైన కానుకను సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, 286 కిలోల బరువున్న భారీ ‘స్వర్ణ ధనుస్సు’ను అయోధ్యకు పంపించనున్నారు. ఒడిస్సాలోని రూర్కెలాలో ఈ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 286 కిలోల బరువు ఉన్న ఈ ధనుస్సును తయారు చేయడానికి అత్యంత ఖరీదైన లోహాలను ఉపయోగించారు. ఇందులో ఒక కిలో బంగారం, రెండున్నర కిలోల వెండితో పాటు […]
వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పసుపు రంగు మిర్చి (Yellow Chilli) సరికొత్త రికార్డును సృష్టించింది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా, పసుపు మిర్చి ధర క్వింటాల్కు ఏకంగా ₹44,000 పలికిందని అధికారులు వెల్లడించారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ ధర భారీగా పెరగడం గమనార్హం. నిన్నటి వరకు క్వింటాల్ ధర ₹42,500 ఉండగా, నేడు అది మరో ₹1,500 పెరిగి […]
వసంత పంచమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది జ్ఞాన సముపార్జనకు నాంది పలికే రోజు. ఈ రోజున చేసే చిన్న తప్పులు కూడా విద్యార్థులపై లేదా కుటుంబంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వసంత కాలం అంటేనే ప్రకృతి పునర్జన్మ పొందే సమయం. చెట్లు చిగుర్చి, పూలు పూసే ఈ కాలంలో పచ్చని చెట్లను కొట్టడం లేదా మొక్కలను నరకడం వంటివి చేయకూడదు. ఈ రోజున ప్రకృతికి హాని చేయడం అంటే సృష్టిని […]
రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో (పంజాగుట్ట PS క్రైం నెం. 243/2024) మాజీ మంత్రి హరీష్రావు విచారణ పూర్తయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ విచారణపై సిట్ అధికారులు తాజాగా స్పష్టతనిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. హరీష్రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం ఆయనను వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అయితే, ఆయన కుమారుడి ఫ్లైట్ ప్రయాణం ఉన్న కారణంగా విచారణను కొంత ముందస్తుగా ముగించవలసి వచ్చిందని సిట్ […]
దశాబ్దాలుగా మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా, వారి ఆయుధ కర్మాగారాలకు , ముఖ్య నాయకులకు షెల్టర్ జోన్గా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం ఇప్పుడు పోలీసుల అధీనంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంలో భాగంగా, వెంకటాపురం మండలం పామునూరు గ్రామ పరిధిలోని కర్రెగుట్టలపై నూతనంగా ఎఫ్.ఓ.బి (FOB) బేస్ క్యాంప్ను అధికారులు ప్రారంభించారు. సి.ఆర్.పి.ఎఫ్ (CRPF) 39వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బేస్ క్యాంప్ను […]
హిందూ సనాతన ధర్మంలో సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవం గా ఆరాధిస్తారు. సమస్త జీవకోటికి వెలుగునిచ్చే భాస్కరుడు జన్మించిన రోజునే రథ సప్తమి లేదా సూర్య జయంతిగా జరుపుకుంటారు. మాఘ మాసంలో వచ్చే ఈ పండుగ చలికాలం ముగిసి, వసంత కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. 2026 సంవత్సరంలో రథ సప్తమి ఎప్పుడు వస్తుంది, పూజకు అనువైన సమయాలు ఏమిటో తెలుసుకుందాం. రథ సప్తమి 2026 తేదీ , శుభ ముహూర్తం హిందూ పంచాంగం ప్రకారం, మాఘ శుక్ల […]
భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్.ఈ. అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక –2026 సదస్సులో భాగంగా దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో యూఏఈ మంత్రి మంగళవారం భేటీ అయ్యారు. ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్రంలో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, […]