Tirumala: డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు.. టోకెన్లు కావాలంటే..!
- డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు
- డీఐపీ టోకెన్లు ఆన్లైన్లో జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది
- వీఐపీ బ్రేక్ దర్శనాలను భారీగా తగ్గించిన టీటీడీ
- వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల భారీ రద్దీ అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే వైకుంఠ ద్వార దర్శనాలు ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు 10 రోజుల పాటు కొనసాగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది.
సర్వదర్శన భక్తుల సౌకర్యార్థం ఈ సారి పెద్ద ఎత్తున మార్పులు చేపట్టినట్టు TTD అధికారులు తెలిపారు. మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1) పూర్తిగా సర్వదర్శన భక్తులకే కేటాయించారు. ఈ మూడు రోజుల్లో మొత్తం 1.88 లక్షల టోకెన్లు DIP (Divya Darshan Incentive Programme) ద్వారా ఆన్లైన్లో జారీ చేయనున్నారు.
రిజిస్ట్రేషన్ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనుండగా, టోకెన్లు డిసెంబర్ 2 నుంచి అందుబాటులో ఉంటాయి. మిగతా ఏడు రోజులు (జనవరి 2 నుంచి 8 వరకు) రోజుకు 15,000 సర్వదర్శన టోకెన్లతో పాటు 1,000 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టోకెన్లు జారీ అవుతాయి. మొత్తం 10 రోజుల్లో సుమారు 8 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుందని అంచనా.
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
సర్వదర్శన భక్తులకు మరింత సమయం కేటాయించేందుకు VIP బ్రేక్ దర్శనాలను గణనీయంగా తగ్గించినట్టు TTD వెల్లడించింది. మొత్తం 184 గంటల వైకుంఠ ద్వార దర్శన సమయంలో 164 గంటలు సర్వదర్శన భక్తులకే కేటాయించారు. మొదటి రోజు 20 గంటల దర్శనం ఉండగా అందులో VIP బ్రేక్ కేవలం 4గంటల 45 నిమిషాలకు పరిమితం చేయగా, మిగతా రోజుల్లో గరిష్ఠంగా 2 గంటలకు మాత్రమే VIP బ్రేక్లు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి (జనవరి 8), వైకుంఠ ద్వాదశి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఆధారంగా క్యూ లైన్లు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. భక్తులు అధికారిక TTD వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా టోకెన్లు బుక్ చేసుకోవాలని TTD కోరింది.
Bandi Sanjay : రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతుంది
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!