CM Revanth Reddy : కొడంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్యాకేజ్
- కొడంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్యాకేజ్
- విద్యా, మౌలిక సదుపాయాల్లో కీలక శంకుస్థాపనలు
- రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లకు భారీ కేటాయింపులు
- కోస్గి అగ్రి మార్కెట్, పట్టణ విస్తరణకు నూతన ఊపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు కొత్త ఊపు వచ్చింది. మొత్తం రూ.103 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, పట్టణాభివృద్ధి నుంచి విద్య, సంక్షేమం వరకు అనేక రంగాల్లో ఈ పనులు ప్రారంభమవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా, నియోజకవర్గంలో మొత్తం 28 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ.5.83 కోట్లు, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.5.01 కోట్లు కేటాయించారు. గ్రామీణ పరిపాలనను బలోపేతం చేసేందుకు 10 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.3 కోట్లు వెచ్చించనున్నారు. బంజారా భవన్లో అదనపు సౌకర్యాల కోసం కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా, విద్యుదీకరణకు కలిపి రూ.3.65 కోట్లు మంజూరు చేశారు.
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Tirumala: డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు.. టోకెన్లు కావాలంటే..!
కొడంగల్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ నిర్మాణానికి రూ.1 కోటి, అగ్నిమాపక కేంద్రానికి రూ.1.30 కోట్లు, స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి రూ.1.40 కోట్లు కేటాయించారు. అలాగే కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి రూ.4.91 కోట్లు, సీసీ రోడ్లు , భూగర్భ డ్రైనేజ్ (UGD) వ్యవస్థ అభివృద్ధికి రూ.4.45 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయ భవనాల ప్రారంభోత్సవం కూడా ఈ సందర్భంగా జరిగింది, వీటి కోసం రూ.2.95 కోట్లు వెచ్చించారు.
కొడంగల్ పట్టణ అభివృద్ధి దిశగా అత్యంత కీలకంగా పరిగణిస్తున్న రోడ్డు విస్తరణ పనులకు ఒక్కటే రూ.60 కోట్లు కేటాయించగా, కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేశారు. కోస్గి వ్యవసాయ మార్కెట్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రూ.4.50 కోట్లు మంజూరు చేయడం రైతులకు ఉపయోగకరంగా ఉండనుంది. ఈ మొత్తం ప్రాజెక్టులు కొడంగల్ నియోజకవర్గపు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషిస్తాయని, ఈ ప్రాంత ప్రజల అవసరాలను తీర్చడంలో పెద్ద అడుగుగా నిలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
Akhanda 2 Thandavam :అఖండ2లో బాలయ్య విశ్వరూపం..ప్రతి యాక్షన్ సీక్వెన్స్కి గూస్బంప్స్!
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!