AP Assembly Budget Sessions 2026: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈసారి అయినా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? అనే చర్చ సాగుతోంది.. ఈ తరుణంలో.. శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకారం, మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ సమావేశాలకు హాజరుకావడం ఖాయమని తెలిపారు. అయితే, రాష్ట్రంలో శాంతి, భద్రత పరిస్థితులు బాగాలేవని బొత్స తెలిపారు. సీఎం చంద్రబాబు ఫ్రస్టేషన్ కారణంగా అనేక విషయాలపై స్పందిస్తున్నారు, అయితే ప్రజల సమస్యలను గణనీయంగా పట్టించుకోవడం లేదు అని ఆరోపించారు.
Read Also: Naravane Book Row: పుస్తక వివాదంపై స్పందించిన మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే..
మరోవైపు.. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పందించిన బొత్స.. అసలు ఆ నెయ్యిలో జంతు కొవ్వు లేదంటూ సీబీఐ నిర్ధారించిందని, అందులో టైమ్ వృధా చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే, సిట్ నివేదిక విడుదలైన తర్వాత ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయడం చట్టబద్ధమా? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ప్రభుత్వం సిట్ నివేదికను పూర్తిగా ప్రజల ముందు ఉంచి బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.. ఇక, వైసీపీ శాసనసభా పక్ష సమావేశం రేపు ఉదయం జరిగే అవకాశం ఉండగా.. అన్ని విషయాలను చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు వైసీపీ శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ..