ESI Hospital : సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
- సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రమాదం
- ఆస్పత్రి బిల్డింగ్లో పని చేస్తుండగా కూలిన సెంట్రింగ్
- ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికులు
- ఆస్పత్రిలో బిల్డింగ్ రెనోవేషన్ చేస్తుండగా ఘటన
- స్లాబ్ పెచ్చులు ఊడి మీద పడడంతో ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ESI Hospital : హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో సోమవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనంలో జరుగుతున్న రెనోవేషన్ పనుల్లో ఘోరం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ వార్డులో సెంట్రింగ్ పనులు కొనసాగుతుండగా అర్ధంతరంగా శిథిలాలు కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం ప్రకారం.. ఆస్పత్రి భవనంలో స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి అక్కడ పని చేస్తున్న సెంట్రింగ్ కార్మికులపై పడింది. వారికి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా కాంక్రీట్ ముక్కలు నేరుగా వారి మీదపడటంతో వారు మృతి చెందారు. ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడి సిబ్బంది, ఇతర కార్మికులు అరుపులు వినిపించడంతో పరుగెత్తుకొని వచ్చి శిథిలాలను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ఎమర్జెన్సీ వార్డులో రెనోవేషన్ పనులు జరుగుతున్న సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెంట్రింగ్, స్లాబ్ పనుల్లో అలాంటి పొరపాట్లు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, భవనం బలహీనత లేదా పనులను సక్రమ పర్యవేక్షణ లేకుండా నిర్వహించడం కారణమా అన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను పూర్తిగా తొలగించి ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకెళ్లగా, ఆస్పత్రి క్యాంపస్లో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘోర ఘటనతో కార్మికుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
Mangalagiri: జీడీపీసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ముందు కురగల్లు సొసైటీ బాధితుల ఆందోళన
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..