Telangana : మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త.. 304 కోట్లు విడుదల
- స్వయం సహాయక మహిళా సంఘాలకు శుభవార్త
- 304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసిన ప్రభుత్వం
- 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో 304 కోట్లు జమ
- మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం : భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం భారీ వరాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో మొత్తం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం జమ చేసింది. ఈ నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా డీఆర్డీఏ అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరునాగారం నుంచి వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి ఏడాది కనీసం రూ.25 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేస్తోందని అధికారులు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు క్రమం తప్పకుండా వడ్డీరహిత రుణాలు ఇస్తూ, వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే దిశగా చర్యలు చేపడుతోంది. తాజాగా విడుదల చేసిన 304 కోట్లు 3,57,098 మహిళా స్వయం సహాయక సంఘాలకు నేరుగా జమయ్యాయి.
Also Read
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
- Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. “మా కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన మహిళా పక్షపాత ప్రభుత్వం. ఆడబిడ్డలను ఆర్థికంగా బలపడేందుకు మేము వేల కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాం. మహిళా సంఘాలకు వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం స్వయంగా వడ్డీలు చెల్లిస్తోంది” అని తెలిపారు. అయితే గత ప్రభుత్వాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రూ.3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందని, అంతేకాకుండా మహిళలు స్వయంగా చేసిన పొదుపు నిధులను కూడా కాజేసిందని ఆరోపించారు. “అక్కా చెల్లెమ్మల కష్టార్జితమైన అభయహస్తం నిధులను గత ప్రభుత్వం మింగేసింది. మహిళా సంక్షేమంపై బీఆర్ఎస్ పెద్దలకు మాట్లాడే నైతిక హక్కు లేదు” అని సీతక్క మండిపడ్డారు.
ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, నిధుల విడుదల మాత్రమే కాదు.. వాటిపై పడే వడ్డీలను కూడా సకాలంలో ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రి తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి దిశగా మరో కీలక అడుగు వేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మహిళా సంఘాలలో మంచి ఉత్సాహాన్ని నింపింది.
తాజావార్తలు
-
Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
-
Car Mileage Tips : ఫోన్ ఛార్జింగ్తో మైలేజ్ పడిపోతుందా? కార్లలో దాగిన అసలు సీక్రెట్ ఇదే.!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
-
NTV Exclusive: త్వరలోనే ‘మెగా పోడ్కాస్ట్’.. బాలయ్య ‘అన్స్టాపబుల్’ రైటర్తో చిరంజీవి బిగ్ ప్లాన్!
ట్రెండింగ్
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!