మెట్రో దగ్గర ఫేక్ దందా..పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న నకిలీ సిబ్బంది.. ప్రజలను బురిడీ కొట్టించేందుకు.. నకిలీ రాయుళ్లు ఎక్కడిపడితే అక్కడ రెడీగా ఉంటున్నారు. ఢిల్లీలోని జనక్ పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ వ్యక్తి.. వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో నకిలీ వసూళ్ల పర్వం బయటపడిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే.. ఇలాంటి బురీడీ రాయుళ్లు ప్రతినిత్యం మనకు ఎక్కడో ఓ చోట తారసపడుతుంటారు. ప్రతి ఒక్క […]
DGP Shivadhar Reddy : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలను అణిచివేయడానికి ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు, నిరంతర ఆపరేషన్లు వేగంగా ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా మరో భారీ లొంగుబాటు చోటుచేసుకుంది. మొత్తం 37 మంది మావోయిస్టులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ వివరాలను వెల్లడించారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన పిలుపుతో మావోయిస్టులు బయటికి వస్తున్నారని చెప్పారు. శాంతియుత […]
Maoists Surrender : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలపై ప్రభుత్వం నడుపుతున్న ఆపరేషన్లు మరోసారి పెద్ద ఫలితాన్ని సాధించాయి. మొత్తం 37 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా కీలక నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాంబయ్య అలియాస్ ఆజాద్ కూడా అధికారుల ముందుకు వచ్చాడు. ఏవోబీ (ఆంధ్ర–ఒడిశా సరిహద్దు) ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన ఆజాద్, గత కొంతకాలంగా భద్రతా దళాల నిఘాలోనే ఉన్నాడని పోలీసు అధికారులు వెల్లడించారు. […]
తెలుగు చిత్రసీమ ఎదురుచూస్తున్న మహేష్ బాబు- రాజమౌళి భారీ ప్రాజెక్ట్కు అధికారికంగా పేరు ఖరారైంది. గ్లోబ్ట్రాటర్ ఈవెంట్ ప్రారంభానికి కొద్దిసేపటికే స్క్రీన్లపై కనిపించిన పేరు.. ‘వారణాసి’. అనంతరం, ఈవెంట్లోనే ట్రైలర్ను రాజమౌళి గ్రాండ్గా విడుదల చేశారు. విజువల్గా అదిరిపోయే ఈ ట్రైలర్ అభిమానులకు పక్కా పండగలా మారింది. ఈవెంట్లో ఏర్పాటు చేసిన భారీ 100 అడుగుల స్క్రీన్పై ట్రైలర్ను ప్రదర్శించారు. అందులో అంటార్కిటికా మంచు పర్వతాలు, ఆఫ్రికా అడవులు, లంకా నగరం, వారణాసి వంటి విభిన్న లొకేషన్లను […]
సంక్రాంతి దగ్గరపడ్తుంటేనే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం మొదలైపోతుంది. కుటుంబం అంతా ఒకేచోట చేరి సందడిగా జరుపుకునే ఈ పండగ కోసం పెద్దలు, చిన్నలు, ముఖ్యంగా విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు.
కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వాళ్లను బీహారీలు తిరస్కరించారు.. సూరత్లో స్థిరపడిన బీహారీలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందిస్తూ.. విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వారిని, ముస్లిం లీగ్ -మావోయిస్టు భావజాలం కలిగిన వారిని ఇక్కడి ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అలాగే, పదేళ్ల నుంచి వరుస ఓటములపై రాహుల్ […]
ఆ జనసేన ఎమ్మెల్యే దందాల్లో ఆరితేరి పోయారా? పెద్ద పెద్ద పరిశ్రమల్ని సైతం లోకల్ ట్యాక్స్తో వేధిస్తున్నారా? తట్టుకోలేని పారిశ్రామికవేత్తలు డైరెక్ట్గా అమరావతిలో ఫిర్యాదు చేశారా? ఎమ్మెల్యే వెనక ఓ పెద్ద ఎంపీ కూడా ఉన్నారన్నది నిజమేనా? ఎవరా వసూల్ రాజా? ఆయనకు మద్దతిస్తున్న ఎంపీ ఎవరు? పారిశ్రామిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ డెస్టినేషన్ అని ప్రకటించుకుంటోంది ఏపీ ప్రభుత్వం. భూములు, రాయితీలు, సింగిల్ విండో పర్మిషన్లతో బిజీగా ఉంది. ఐతే, ప్రభుత్వ లక్ష్యానికి, ఆలోచనలకు […]
HYDRA : బోడుప్పల్లోని సుద్దకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అకస్మిక పరిశీలన నిర్వహించారు. చెరువు వద్ద FTL పేరుతో HMDA, మున్సిపల్ అధికారులు ఇళ్లపై నెంబర్లు వేశారు, ఇనుప కడ్డీలు పెట్టి ప్రజల్లో భయాందోళనలకు గురిచేశారంటూ స్థానికులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. 30 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, అకస్మాత్తుగా FTL పేరుతో తమపై ఒత్తిడి తేవడం అన్యాయం అని వారు వేదన వ్యక్తం చేశారు. స్థితిగతులను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, ఇళ్లపై చేసిన […]
ఎక్కడ…? ఎమ్మెల్సీ ఎక్కడ…? పోస్ట్ వచ్చిన కొత్తల్లో పెద్ద పెద్ద టూర్ ప్లాన్స్ వేసి కొన్నాళ్ళు ఓ రేంజ్లో హడావిడి చేసిన నాయకుడు ఇప్పుడెందుకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు? అసలు ఏపీకే ఆయన చుట్టమైపోయారా? ప్రస్తుతం జనసేన వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఏ ఎమ్మెల్సీ కోసం పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి? ఎందుకలా..? నాగబాబు…. జనసేన కీలక నేత. పార్టీలో పవన్ తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యం ఇస్తుంది కేడర్. ఇక ఎమ్మెల్సీ పదవివచ్చిన […]