APSRTC : సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక బస్సులు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ.!
- సంక్రాంతికి APSRTC ప్రత్యేక బస్సులు
- రద్దీ నేపథ్యంలో అదనపు సర్వీసులు
- గోదావరి జిల్లాలకు ప్రత్యేక ఏర్పాట్లు
- హైదరాబాద్, బెంగళూరు నుంచి మరిన్ని బస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APSRTC : సంక్రాంతి పండుగ వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో, ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే పండుగ సీజన్కు సంబంధించిన ఆన్లైన్ రిజర్వేషన్లు దాదాపుగా నిండిపోయిన నేపథ్యంలో, అదనపు సర్వీసుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని ఆర్టీసీ నిర్ణయించింది.
Hyundai Venue HX 5 Plus: హై-టెక్ ఫీచర్లతో.. హ్యుందాయ్ వెన్యూ HX 5 ప్లస్ వేరియంట్ రిలీజ్..
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
ఈ ఏడాది సంక్రాంతి పండుగ బుధ, గురు, శుక్రవారాల్లో వస్తుండటంతో ప్రయాణాల రద్దీ ముందే ప్రారంభం కానుంది. గత ఏడాది పండుగ రోజులు వీకెండ్కు అటు ఇటుగా ఉండటంతో రద్దీ అంతా ఒకేసారి ఉండేది, కానీ ఈసారి రద్దీ శుక్రవారం రాత్రి నుంచే మొదలై వారం అంతా విస్తరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా వివిధ డిపోల నుంచి బస్సుల షెడ్యూల్ను రూపొందించారు. ముఖ్యంగా ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలైన రాజమండ్రి, రావులపాలెం, భీమవరం, నరసాపురం వంటి ప్రాంతాలకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాలకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నిరంతరం బస్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
కేవలం రాష్ట్రంలోని జిల్లాలకే పరిమితం కాకుండా, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే వారి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు వేల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. వీరి కోసం సుదూర ప్రాంతపు సర్వీసులను పెంచడమే కాకుండా, రద్దీని బట్టి ఎప్పటికప్పుడు అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సంక్రాంతి ప్రయాణం సురక్షితంగా , సుఖవంతంగా సాగేలా ఆర్టీసీ యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టింది.
BJP: భారత వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి సంబంధాలు.. ఇవే ఆధారం అంటున్న బీజేపీ..
తాజావార్తలు
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!