APSRTC : సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక బస్సులు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ.!
- సంక్రాంతికి APSRTC ప్రత్యేక బస్సులు
- రద్దీ నేపథ్యంలో అదనపు సర్వీసులు
- గోదావరి జిల్లాలకు ప్రత్యేక ఏర్పాట్లు
- హైదరాబాద్, బెంగళూరు నుంచి మరిన్ని బస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APSRTC : సంక్రాంతి పండుగ వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో, ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే పండుగ సీజన్కు సంబంధించిన ఆన్లైన్ రిజర్వేషన్లు దాదాపుగా నిండిపోయిన నేపథ్యంలో, అదనపు సర్వీసుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని ఆర్టీసీ నిర్ణయించింది.
Hyundai Venue HX 5 Plus: హై-టెక్ ఫీచర్లతో.. హ్యుందాయ్ వెన్యూ HX 5 ప్లస్ వేరియంట్ రిలీజ్..
Also Read
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్కు వైద్య పరీక్షలు!
- Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
- AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
ఈ ఏడాది సంక్రాంతి పండుగ బుధ, గురు, శుక్రవారాల్లో వస్తుండటంతో ప్రయాణాల రద్దీ ముందే ప్రారంభం కానుంది. గత ఏడాది పండుగ రోజులు వీకెండ్కు అటు ఇటుగా ఉండటంతో రద్దీ అంతా ఒకేసారి ఉండేది, కానీ ఈసారి రద్దీ శుక్రవారం రాత్రి నుంచే మొదలై వారం అంతా విస్తరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా వివిధ డిపోల నుంచి బస్సుల షెడ్యూల్ను రూపొందించారు. ముఖ్యంగా ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలైన రాజమండ్రి, రావులపాలెం, భీమవరం, నరసాపురం వంటి ప్రాంతాలకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాలకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నిరంతరం బస్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
కేవలం రాష్ట్రంలోని జిల్లాలకే పరిమితం కాకుండా, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే వారి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు వేల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. వీరి కోసం సుదూర ప్రాంతపు సర్వీసులను పెంచడమే కాకుండా, రద్దీని బట్టి ఎప్పటికప్పుడు అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సంక్రాంతి ప్రయాణం సురక్షితంగా , సుఖవంతంగా సాగేలా ఆర్టీసీ యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టింది.
BJP: భారత వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి సంబంధాలు.. ఇవే ఆధారం అంటున్న బీజేపీ..
తాజావార్తలు
-
Ten Doeschate-KKR: టీమిండియా తరిమేసింది.. కేకేఆర్ అక్కున చేర్చుకుంది.. ర్యాన్ డస్కాటె భలే లక్కీ!
-
Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
-
Income Tax: భారత్లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
-
Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్లను జుజుబి అన్న ఫించ్!
-
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?