APSRTC : సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక బస్సులు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ.!
- సంక్రాంతికి APSRTC ప్రత్యేక బస్సులు
- రద్దీ నేపథ్యంలో అదనపు సర్వీసులు
- గోదావరి జిల్లాలకు ప్రత్యేక ఏర్పాట్లు
- హైదరాబాద్, బెంగళూరు నుంచి మరిన్ని బస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APSRTC : సంక్రాంతి పండుగ వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో, ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే పండుగ సీజన్కు సంబంధించిన ఆన్లైన్ రిజర్వేషన్లు దాదాపుగా నిండిపోయిన నేపథ్యంలో, అదనపు సర్వీసుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని ఆర్టీసీ నిర్ణయించింది.
Hyundai Venue HX 5 Plus: హై-టెక్ ఫీచర్లతో.. హ్యుందాయ్ వెన్యూ HX 5 ప్లస్ వేరియంట్ రిలీజ్..
Also Read
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
ఈ ఏడాది సంక్రాంతి పండుగ బుధ, గురు, శుక్రవారాల్లో వస్తుండటంతో ప్రయాణాల రద్దీ ముందే ప్రారంభం కానుంది. గత ఏడాది పండుగ రోజులు వీకెండ్కు అటు ఇటుగా ఉండటంతో రద్దీ అంతా ఒకేసారి ఉండేది, కానీ ఈసారి రద్దీ శుక్రవారం రాత్రి నుంచే మొదలై వారం అంతా విస్తరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా వివిధ డిపోల నుంచి బస్సుల షెడ్యూల్ను రూపొందించారు. ముఖ్యంగా ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలైన రాజమండ్రి, రావులపాలెం, భీమవరం, నరసాపురం వంటి ప్రాంతాలకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాలకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నిరంతరం బస్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
కేవలం రాష్ట్రంలోని జిల్లాలకే పరిమితం కాకుండా, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే వారి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు వేల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. వీరి కోసం సుదూర ప్రాంతపు సర్వీసులను పెంచడమే కాకుండా, రద్దీని బట్టి ఎప్పటికప్పుడు అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సంక్రాంతి ప్రయాణం సురక్షితంగా , సుఖవంతంగా సాగేలా ఆర్టీసీ యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టింది.
BJP: భారత వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి సంబంధాలు.. ఇవే ఆధారం అంటున్న బీజేపీ..
తాజావార్తలు
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్కార్న్, కూల్డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!