SLBC Tunnel: నిపుణుల కమిటీకి SLBC హెలిమాగ్నెట్ రిపోర్ట్
- నిపుణుల కమిటీకి SLBC హెలిమాగ్నెట్ రిపోర్ట్
- NGRI సర్వేలో షీర్ జోన్ గుర్తింపు
- TBM తప్పించి కొత్త విధానం పరిశీలన
- 9 కి.మీ టన్నెల్ పనులపై త్వరలో నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్ నిర్మాణ పనులలో కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎదురవుతున్న భూగర్భ అడ్డంకులను గుర్తించేందుకు ఎన్జీఆర్ఐ (NGRI) శాస్త్రవేత్తలు నిర్వహించిన హెలి మాగ్నెట్ సర్వే నివేదిక తాజాగా నిపుణుల కమిటీకి చేరింది. ప్రత్యేక హెలికాప్టర్ సహాయంతో సుమారు 13 లైన్లలో సర్వే చేపట్టిన శాస్త్రవేత్తలు, భూమి లోపల దాదాపు 800 మీటర్ల లోతు వరకు ఉన్న భూ స్వరూపంపై సమగ్ర సమాచారాన్ని ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ సర్వేలో భాగంగా నల్లవాగు సమీప ప్రాంతంలో ‘షీర్ జోన్’ ఉన్నట్లు గుర్తించగా, మిగిలిన చోట్ల టన్నెల్ నిర్మాణానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు సమాచారం అందింది.
AP Deputy CM Pawan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. 96 గదుల నిర్మాణానికి శంకుస్థాపన
Also Read
భూగర్భ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పుడు తన నిర్మాణ వ్యూహాన్ని మార్చే యోచనలో ఉంది. గతంలో ఉపయోగించిన టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, మిగిలి ఉన్న 9 కిలోమీటర్ల టన్నెల్ పనులను పూర్తి చేయడానికి ‘డ్రిల్ అండ్ బ్లాస్ట్’ పద్ధతిని ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మన్నేవారిపల్లి వైపు నుంచి ప్రస్తుత టిబిఎం మిషన్ను తొలగించేందుకు అవసరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిపుణుల కమిటీ ఈ నివేదికను పరిశీలించిన తర్వాత, మరో రెండు మూడు రోజుల్లో ఎస్ఎల్బిసి టన్నెల్ పనులపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తయితే సాగు, తాగునీటి సరఫరాకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?