Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Telangana River Water Disputes High Level Committee

AP Telangana Water Dispute :తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కమిటీ

Published Date :January 2, 2026 , 4:26 pm
By Gogikar Sai Krishna
  • తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కమిటీ
  • కేంద్ర జలసంఘం చైర్మన్‌ నేతృత్వంలో కమిటీ
  • కమిటీ సభ్యులుగా రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులు
  • కమిటీలో సభ్యులుగా కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు.
AP Telangana Water Dispute :తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కమిటీ
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న నదీజలాల వివాదాలకు ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలసంఘం (CWC) చైర్మన్ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. గత 11 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సహకార సమాఖ్య స్ఫూర్తితో పరిష్కరించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.

ఈ కమిటీ కూర్పును పరిశీలిస్తే, ఇందులో రెండు రాష్ట్రాల నుంచి కీలక ప్రతినిధులకు చోటు కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ మరియు ఇంజనీర్-ఇన్-చీఫ్ సభ్యులుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తరపున జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, శాఖ సలహాదారు, ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఇరిగేషన్) మరియు చీఫ్ ఇంజనీర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరితో పాటు కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB), గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (NWDA) మరియు CWC చీఫ్ ఇంజనీర్లు కూడా ఈ కమిటీలో భాగస్వామ్యులై సాంకేతిక అంశాలను పర్యవేక్షిస్తారు.

Also Read

  • Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
Add as a preferred
source on google

CNAP Service: ఇంటర్నెట్ అవసరం లేదు.. యాప్‌తో పని లేదు.. ఫోన్ స్క్రీన్‌పై డైరెక్ట్‌గా కాలర్ పేరు

ఈ కమిటీ ఏర్పాటుకు బీజం జూలై 2025లో ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పడింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన ఆ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని తమ అభ్యంతరాలను, వివాదాలను ప్రస్తావించారు. ఆ చర్చల ఫలితంగానే, సమస్యలను సాంకేతికంగా పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించేందుకు ఉమ్మడి కమిటీ అవసరమని భావించారు. ఇందుకోసం ఇరు రాష్ట్రాలు తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని కోరగా, డిసెంబర్ 2025లో తెలంగాణ ప్రభుత్వం తన నామినేషన్లను పూర్తి చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ కమిటీని అధికారికంగా నోటిఫై చేసింది.

కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (KWDT-2) గడువును కూడా కేంద్రం 2026 జూలై వరకు పొడిగించి, వివాదాల పరిష్కారానికి నిరంతర సహకారాన్ని అందిస్తోంది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 84 ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల మేరకు, ఇప్పుడు ఏర్పాటైన ఈ నూతన కమిటీ క్షేత్రస్థాయిలో ఉన్న జలవివాదాలను లోతుగా అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ రాకతో గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగంపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయి, రెండు రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో బిగ్‌ రిలీఫ్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP-Telangana Water Dispute
  • Central Water Commission
  • Godavari River Water
  • Jal Shakti Ministry
  • krishna river water

తాజావార్తలు

  • Vijay-Governor: గవర్నర్‌ను కలిసిన విజయ్.. 112 ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత

  • Akhilesh Yadav: ఐప్యాక్‌తో అఖిలేష్ యాదవ్ తెగదెంపులు.. నమ్మకం పోయిందా? భయం పట్టుకుందా?

  • Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.

  • Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.

  • MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions