Uttam Kumar Reddy : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం జరిగిన మీడియా చిట్ చాట్లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం నుండి కృష్ణా జలాల పంపకాల వరకు బీఆర్ఎస్ నేతలు అనుసరించిన విధానాలు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని, […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సర్వంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 56వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధికి సంబంధించి ఏడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. రాజధానిలో సాంకేతిక విప్లవానికి […]
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 56వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని పనుల పురోగతి, కొత్త టెండర్లు, భూ కేటాయింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిని నాలెడ్జ్ హబ్గా మార్చే దిశగా, రాజధానిలో ‘క్వాంటం కంప్యూటింగ్ సెంటర్’ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచే అంశంపై అథారిటీ […]
Co Living Hostels: భాగ్యనగరంలోని ఐటీ హబ్గా పేరుగాంచిన మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పరిసరాల్లోని కో-లివింగ్ హాస్టల్స్ ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం అంజయ్యనగర్లోని ‘కో-లివ్ గార్నెట్ పీజీ హాస్టల్’ వేదికగా జరుగుతున్న డ్రగ్స్ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ (SOT) పోలీసులు, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్లో కో-లివింగ్ హాస్టళ్ల ముసుగులో సాగుతున్న చీకటి వ్యాపారం బయటపడింది. హాస్టల్పై ఆకస్మిక దాడి చేసిన పోలీసు […]
CM Revanth Reddy : దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కలుగులో నుంచి బయటకు వచ్చిన కేసీఆర్, తన పాత పద్ధతిని మార్చుకోకుండా మళ్ళీ అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఘాటుగా స్పందించారు. ఓటమితోనైనా కేసీఆర్ మారుతారని ఆశించానని, కానీ ఆయన తీరు మారలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని […]
Uttam Kumar Reddy : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని, తెలంగాణ ఇరిగేషన్ రంగాన్ని పదేళ్లలో కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ విమర్శలకు మంత్రి లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తన హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి, […]
విశాఖలోని జడ్జీ కోర్టు ఎదురుగా ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్లో కాస్మోటిక్స్, ఫుట్ వేర్, హోంనీడ్స్ను ఆదివారం ఆ సంస్త యాజమాన్యం ప్రారంభించింది. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు హాజరై మాల్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ విశాఖకే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే సీఎంఆర్ తలమానికంగా నిలిచిందని కొనియాడారు. నాణ్యమైన వస్త్రాల్ని సరసమైన ధరలకే అందించడం సీఎంఆర్ ప్రత్యేకతన్నారు. […]
“బంగ్లాదేశీయుడి”గా పొరబడి వలస కార్మికుడి దారుణ హత్య.. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు సగటు భారతీయుడిలో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. బంగ్లాలోని మైమన్సింగ్ జిల్లాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్ను మతోన్మాద మూక ‘‘దైవ దూషణ’’ చేశాడనే ఆరోపణలపై అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇది భారతీయుల్లో కోపానికి కారణమవుతోంది. ఇదిలా ఉంటే, కేరళలో వలస కార్మికుడిని ‘‘బంగ్లాదేశ్ వ్యక్తి’’గా పొరబడి దారుణంగా కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్ శక్తి జిల్లాకు చెందిన 31 ఏళ్ల రామనారాయణ్ […]
హైదరాబాద్ వేదికగా సినీ గ్లామర్ , క్రికెట్ జోష్ కలగలిసిన ఒక సరికొత్త క్రీడా పండుగకు తెరలేచింది. EBG గ్రూప్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) ప్రారంభోత్సవ వేడుక భాగ్యనగరంలోని HICC లో అత్యంత వైభవంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ లీగ్ను అధికారికంగా ప్రారంభించడమే కాకుండా, దీనికి హానరరీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ముందుండి నడిపిస్తున్నారు. ఈ వేడుకకు భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, […]
KCR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమం “సడి లేదు సప్పుడు లేదు” అన్న చందంగా తయారయ్యాయని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకాన్ని కూడా ప్రజల కోసం తీసుకురాలేదని, పైగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన […]