Pulicat Flamingo Festival: పులికాట్ సరస్సులో ఫ్లెమింగో ఫెస్టివల్
- పులికాట్ సరస్సు.. విదేశీ పక్షుల స్వర్గధామం
- నేలపట్టు బర్డ్ సాంక్చువరీలో సంతానోత్పత్తి సందడి
- రెండు రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రధాన ఆకర్షణలు
- పర్యాటకుల కోసం ప్రభుత్వం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulicat Flamingo Festival: ప్రకృతి ఆరాధకులకు, పక్షుల ప్రేమికులకు పండుగ సమయం వచ్చేసింది. నెల్లూరు , తిరుపతి జిల్లాల సరిహద్దులోని పులికాట్ సరస్సు తీరానికి ఖండాంతరాలు దాటి వచ్చిన విదేశీ పక్షుల సందడి మొదలైంది. ఈ విశిష్ట అతిథుల రాకను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ (పక్షుల పండుగ) ఈ ఏడాది జనవరి 10 , 11 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు సరిహద్దుల్లో దాదాపు 620 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న పులికాట్ సరస్సు, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా గుర్తింపు పొందింది. ఇక్కడి జీవ వైవిధ్యం , సరస్సులో లభించే చేపలు, నత్తలు, వానపాములు వంటి సమృద్ధిగా ఉండే ఆహార వనరుల కారణంగా ఏటా వేల సంఖ్యలో విదేశీ పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ , జనవరి నెలల్లో నైజీరియా, ఈజిప్ట్, సైబీరియా వంటి దేశాల నుంచి సుమారు 108 రకాల విదేశీ విహంగాలు ఇక్కడికి చేరుకుంటాయి.
Also Read
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
తిరుపతి జిల్లాలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం దశాబ్దాలుగా వలస పక్షులకు సురక్షితమైన సంతానోత్పత్తి కేంద్రంగా ఉంది. ప్రస్తుతం నేలపట్టులో గ్రే పెలికాన్, వైట్ ఐబిస్, లిటిల్ కోర్మోరెంట్, స్పూన్ బిల్ స్టార్క్ , ఓపెన్ బిల్ స్టార్క్ వంటి సుమారు ఐదు ప్రధాన రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ దాదాపు 30,000 పక్షులు చేరుకున్నాయని, అవి గూళ్లు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలను పొదిగే ప్రక్రియ (Breeding) కూడా ప్రారంభించాయని అధికారులు తెలిపారు. ఈ పక్షులు తమ పిల్లలకు రెక్కలు వచ్చి, అవి ఎగరడం నేర్చుకునే వరకు అంటే ఏప్రిల్ లేదా మే నెలల వరకు ఇక్కడే ఉండి, ఆ తర్వాత తిరిగి తమ స్వస్థలాలకు ప్రయాణమవుతాయి.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తోంది. ఈసారి సూళ్లూరుపేట, దొరవారి సత్రం, తడ, ఇరకం ఐలాండ్, శ్రీ సిటీ , ఉబ్బలమడుగు జలపాతం వంటి ఏడు ప్రధాన వేదికలపై వేడుకలు జరగనున్నాయి. పర్యాటకుల కోసం సాండ్ ఆర్ట్ (ఇసుక శిల్పాలు), స్నేక్ షో , స్థానిక కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. సూళ్లూరుపేట ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శనలు , స్టాల్స్ కొలువుదీరనున్నాయి. తడ భీములవారి పాలెం పడవల రేవు వద్ద సందర్శకులు సరస్సు అందాలను ఆస్వాదించేందుకు ప్రత్యేక బోట్ శికార్ సౌకర్యాన్ని కల్పించారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ , స్థానిక ఎమ్మెల్యేల పర్యవేక్షణలో పర్యాటకుల కోసం అన్ని వసతులు సిద్ధం చేశారు. తాగునీరు, బయో-టాయిలెట్స్ , ట్రాఫిక్ నియంత్రణ వంటి చర్యలు చేపట్టారు. అలాగే, పులికాట్ సరస్సు ప్రాముఖ్యతను , పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించేందుకు పర్యావరణ వేత్తలతో ప్రత్యేక సెమినార్లు కూడా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శీతాకాలపు ఆహ్లాదకర వాతావరణంలో, కిలకిలరావాల మధ్య విదేశీ పక్షుల అందాలను వీక్షించేందుకు ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.
తాజావార్తలు
-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
-
Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బలహీనత బయటపడిందా?.. రాజస్థాన్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
-
Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..