భానుడి భగభగలకు మనుషులు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడమే కాకుండా, ఒక్కోసారి వారి మానసిక స్థితి కూడా తలకిందులవుతుందని నిరూపించే ఘటన ఒకటి థాయిలాండ్లో వెలుగుచూసింది. ఖోన్ కేన్ ప్రాంతంలో ఒక వ్యక్తి తీవ్రమైన ఎండలో సుదీర్ఘకాలం ప్రయాణించి, చివరకు మతిస్థిమితం కోల్పోయిన స్థితిలో నగ్నంగా పెట్రోల్ బంకులోకి రావడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. బాధితుడు తన మోటార్సైకిల్పై వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ వస్తున్నాడు. ఆ సమయంలో ఎండ తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. చాలా […]
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన విమర్శలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఇప్పుడు ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రభుత్వ ఖజానా సరిపోతోందని ఆమె ధ్వజమెత్తారు. “పాండవులు సంపాదించింది కౌరవుల తద్దినానికే సరిపోయినట్లు.. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే మాకు సరిపోతోంది” అంటూ ఆమె ఎద్దేవా చేశారు. హరీష్ రావు తన నియోజకవర్గంలోనే రైతులకు […]
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ చర్చలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత బడ్జెట్ ప్రసంగంలో ప్యూరిటీ (Purity), క్లారిటీ (Clarity), షూరిటీ (Surety) ఏమీ లేవని, ఇది కేవలం అంకెల గారడీ అని ఆయన విమర్శించారు. రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం ఏ రకంగా వంచిస్తోందో హరీష్ రావు గణాంకాలతో సహా వివరించారు. మేనిఫెస్టోలో ప్రతి ఎకరానికి రూ. 15,000 ఇస్తామని చెప్పి, అధికారంలోకి […]
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కేవలం హామీలకే పరిమితం కాకుండా, వాటికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన అధికారిక నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు అసెంబ్లీ సెక్రెటరీకి కూడా అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తామంటున్న ఆరు గ్యారంటీలకు చట్టపరమైన రక్షణ ఉంటేనే లబ్ధిదారులకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని, ఈ బిల్లు ద్వారా ఆయా పథకాల అమలులో పారదర్శకత , […]
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సామాన్య కుటుంబానికి , ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని అధికారికంగా ప్రకటించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి బీమా రక్షణ కల్పించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచామని ఆయన సగర్వంగా ప్రకటించారు. ప్రభుత్వం […]
ప్రధాని మోడీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం పని చేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ.. మొత్తం 8,931 రోజుల పాటు విరామం లేకుండా అధికారంలో కొనసాగిన రికార్డును మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. అసలు సర్పంచ్ కూడా కాని వ్యక్తి సీఎం ఎలా అయ్యారు..? తొలిసారి ఎంపీకి.. ప్రధాని పదవి ఎలా దక్కింది..? అధికారం వచ్చింది సరే.. దాన్ని […]
మధ్యప్రాచ్యంలో యుద్ధం అత్యంత భయంకరమైన , ప్రమాదకరమైన దశకు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్లోని నతాన్జ్ అణు కేంద్రం, ఇజ్రాయెల్లోని దిమోనా అణు సదుపాయం ఉన్న నగరంపై దాడులు జరిగినట్లు వచ్చిన నివేదికలతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) ప్రస్తుతం లోతైన దర్యాప్తు చేస్తోందని, ప్రస్తుతానికి రేడియేషన్ స్థాయుల్లో ఎలాంటి […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యున్నత సాంకేతికతతో, హైదరాబాద్ నగరాన్ని మించేలా ఒక స్మార్ట్ సిటీగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత ఐదేళ్ల పాలనలో అమరావతిని పూర్తిగా పక్కన పడేశారని, కానీ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో దానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని, వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన […]
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంఖ్యల చుట్టూ తిరిగే అంకెల గారడీ కాదని, ప్రతి సామాన్యుడి చుట్టూ తిరిగే మానవీయ కోణం ఉన్న ప్రణాళిక అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, గతంలో అనేక కుటుంబాలు యజమానిని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉండటాన్ని తాము గమనించామని, అందుకే రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించేలా భారీ ఎత్తున […]
సిద్దిపేట గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. దశాబ్దాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉన్న సిద్దిపేట రాజకీయాల్లో మార్పు రావాలని పిలుపునిచ్చిన ఆయన, రాబోయే 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని భారీ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, ఆ ఎమ్మెల్యేను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునే బాధ్యతను తాను, మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి తీసుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. రాజకీయంగా హరీష్ రావు, కేటీఆర్ లేదా […]