ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు కీలక సమాచారం. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 2026 మార్చిలో నిర్వహించనున్న ఎస్ఎస్సీ (SSC), ఓఎస్ఎస్సీ (OSSC) , వొకేషనల్ పబ్లిక్ పరీక్షల సమగ్ర షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలు 2026 మార్చి 16వ తేదీన ప్రారంభమై, ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు తమ ప్రిపరేషన్ను వేగవంతం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తుగానే ఈ టైమ్ టేబుల్ను ప్రకటించింది. పరీక్షలన్నీ ఉదయం 09:30 గంటలకు ప్రారంభమవుతాయి. మెజారిటీ […]
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి హరీష్రావును ప్రత్యేక విచారణ బృందం (SIT) సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులు ఆయన నుంచి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులతో ఉన్న సంబంధాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలపై సిట్ అధికారులు హరీష్రావును సుమారు 4 […]
స్విట్జర్లాండ్లోని దావోస్లో నేటి నుంచి జనవరి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పాల్గొంటోంది. ఈ అంతర్జాతీయ వేదికపై ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రదర్శించనుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులకు వివరించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి […]
Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విచారణలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీష్రావుకు ప్రత్యేక విచారణ బృందం (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ అధికారులు, ఈ వ్యవహారంలో హరీష్రావు ప్రమేయంపై ఆరా తీసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా […]
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒక కీలకమైన అడుగు పడింది. రాష్ట్ర మున్సిపల్ రిజర్వేషన్ల జాబితా ఖరారు కావడంతో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ఈ వివరాలను తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ జాబితాలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు , వార్డుల వారీగా కేటాయించిన రిజర్వేషన్లను స్పష్టంగా పొందుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఉన్న 2,996 వార్డులు , డివిజన్లకు ఈ […]
పశ్చిమ బెంగాల్ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో జరుగుతున్న వివాదం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎస్.ఐ.ఆర్ పరిధిలోకి వచ్చే ఓటర్ల పేర్లను బహిరంగంగా ప్రదర్శించాలని భారత ఎన్నికల సంఘాన్ని (ECI) అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ముఖ్యంగా ఎస్.ఐ.ఆర్ పరిధిలోకి వస్తారంటూ ఎవరికైతే నోటీసులు జారీ చేయబడ్డాయో, అటువంటి వ్యక్తుల జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీలు, […]
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మీద సొంత కేడరే అసంతృప్తిగా ఉందా? ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారంటూ పార్టీలోని ఓ వర్గం రగిలిపోతోందా? చెప్పి వెళ్ళాలి, చెప్పులేసుకుని వెళ్ళాలంటూ మినిస్టర్ పెడుతున్న కండిషన్స్ వాళ్ళకు మింగుడు పడ్డం లేదా? పైగా… పబ్లిక్లో పరువు తీస్తున్నారంటూ ఫైరవుతున్నారా? ఇంతకీ ఏ విషయంలో నారాయణకు, కేడర్కు మధ్య గ్యాప్ వచ్చింది? కార్యకర్తల అసంతృప్తికి కారణాలేంటి? ఏపీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణ మీద సింహపురి టీడీపీ కేరడ్ తీవ్ర అసంతృప్తితో ఉందట. […]
సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల సందడి మళ్ళీ మొదలైంది. తమ స్వగ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్కు పయనం కావడంతో నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా చిట్యాల సమీపంలోని జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఒకేసారి రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ప్రయాణికులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. […]
సంక్రాంతి సీజన్లో కోడి పందేలకంటే ఎక్కువగా…. ఆ ఇద్దరు నేతల మధ్య పగలు రగులుతున్నాయా? నీ నియోజకవర్గానికి నువ్వేం చేశావో చెప్పమని ఒకరు సవాల్ చేస్తే… మరి నీ సంగతేంటంటూ మరొకరు రివర్స్లో వేలు చూపిస్తున్నారు. పందెం కోళ్లలా కాలు దువ్వుతున్న ఆ మహిళా నేతలు ఎవరు? ఎక్కడ పేలుతున్నాయి ఆ మాటల తూటాలు? రాయలసీమలో పొలిటికల్ పౌరుషాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన తాడిపత్రిలో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, […]
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రావినూతల గ్రామం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త సోలార్ విప్లవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం ప్రతి ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడమేనని, ఇకపై ప్రజలు విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించే రోజులు పోయి, విద్యుత్ శాఖే ప్రజలకు డబ్బులు చెల్లించే రోజులు వచ్చాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అత్యంత భారీగా […]