Delhi: ఢిల్లీలో కలకలం.. పార్కింగ్ కారులో మృ*తదేహాలు
- దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
- పార్క్ చేసి ఉన్న కారులో 3 మృతదేహాలు
- పీరాగఢి ఫ్లైఓవర్ వద్ద పార్క్ చేసి ఉన్న కారు
- ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు
- సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీ నగరంలోని పీరాగడి ఫ్లైఓవర్ సమీపంలో ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొదట ఆ కారులో పేలుడు పదార్థాలు ఏవైనా ఉన్నాయేమోనని అందరూ భయాందోళనలకు గురైనప్పటికీ, పోలీసులు వచ్చి తనిఖీ చేయగా లోపల ముగ్గురు వ్యక్తులు నిర్జీవంగా పడి ఉండటం చూసి షాక్కు గురయ్యారు.
కారులో మరణించిన వారిని లక్ష్మి, రణధీర్, , శివనారాయణలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతదేహాలు లభ్యమైన కారు పీరాగడి ఫ్లైఓవర్ వద్ద అనుమానాస్పద స్థితిలో నిలిపి ఉంచబడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
ఈ మరణాలకు సంబంధించి పోలీసులు పలు కోణాల్లో విచారణను ముమ్మరం చేశారు. మృతులు ముగ్గురు విషం (Poison) తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, వారు అక్కడే ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరెక్కడైనా మరణించిన తర్వాత వారిని ఈ కారులో తీసుకువచ్చి ఇక్కడ వదిలిపెట్టారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మిస్టరీని ఛేదించడానికి ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కేసులో నిజానిజాలను వెలికితీసేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పీరాగడి ఫ్లైఓవర్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ కారు ఎక్కడి నుండి వచ్చింది? కారును అక్కడ ఎవరు పార్క్ చేశారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు క్లూస్ టీమ్ , ఫారెన్సిక్ నిపుణులు కారు లోపల ఉన్న వేలిముద్రలు , ఇతర కీలక ఆధారాలను సేకరించారు. ఈ మరణాల వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?